ఏఎన్నార్ విగ్రహావిష్కరణ వేడుకకు విచ్చేసిన రామ్ చరణ్ మహేష్!

తెలుగు తెర ‘దేవదాసు’ ఏఎన్నార్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమం అన్నపూర్ణ స్టూడియోలో ఆహూతుల నడుమ ఎంతో వైభవంగా జరిగింది. ఇందులో రాజకీయ నాయకులతోపాటు సినీ తారలు భారీగా పాల్గొని ఆ కార్యక్రమానికి వన్నె చేకూర్చారు. ఈ సందర్బంగా బ్రహ్మానందం, రామ్‌చరణ్‌, మహేష్‌బాబు, నాని, రాజమౌళి, మంచు విష్ణు మరియు ఇతర తారలు భారీగా హాజరయ్యారు. అన్నపూర్ణ స్టూడియోలో ఏఎన్నార్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా వచ్చిన వెంకయ్య నాయుడు ఏఎన్నార్‌ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా నాగార్జున, అక్కినేని ఫ్యామిలీ ఎమోషనల్‌ అయ్యింది.

అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి నిర్మాతలు అల్లు అరవింద్‌, దిల్‌రాజు, సీ కళ్యాణ్‌, జెమినీ కిరణ్‌, ఇతర సినీ, రాజకీయ ప్రముఖులు అనేకమంది హాజరయ్యారు. 1924 సెప్టెంబర్ 20న కృష్ణా జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో జన్మించిన ఏఎన్నార్.. సినీ రంగంలో ఒక లెజెండ్ గా ఎదిగిన తీరు అందరికీ ఆచరణీయం. తెలుగు సినిమాలోనే కాదు భారతీయ చలనచిత్రలో అక్కినేని ఒక ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నారు. ఇక ఈ ఏడాది 100వ జయంతి జరుగుతుండడంతో అక్కినేని కుటుంబం.. ఈ జయంతిని ఘనంగా చేస్తున్నారు.

కాగా ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో అక్కినేని అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇక ఏఎన్నార్ శతజయంతి కావడంతో సినీ ప్రముఖులు ఆయనను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు వేస్తున్నారు. ఈక్రమంలోనే చిరంజీవి ఆయనకు నివాళి అర్పిస్తూ ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేయగా ఆ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ సందర్బంగా ఆయన తెలుగు సినిమా బ్రతికినంత వరకు అక్కినేని నాగేశ్వరరావు తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో ఎప్పటికీ ఉంటారని ఆ ట్వీట్లో రాసుకొచ్చారు.