సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ లో హీరో విశాల్ ముందుంటాడు. ఈయన వయసులో 45. కానీ, ఇంత వరకు పెళ్లి పీటలెక్కలేదు. గతంలో ఈయన వరలక్ష్మీ శరత్ కుమార్తో కొన్నాళ్లు లవ్ ట్రాక్ నడిపించాడు. ఆమెతో విడిపోయిన తర్వాత తెలుగు అమ్మాయి అనీషా రెడ్డితో ప్రేమలో పడ్డాడు. దాదాపు ఆరేళ్ల సహజీవనం చేసిన తర్వాత పెళ్లికి రెడీ అయిన వీరిద్దరూ.. గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు.
కానీ, పెళ్లి వరకు వెళ్లకుండానే బ్రేకప్ చెప్పుకున్నారు. అప్పటి నుంచి విశాల్ పెళ్లి ఊసే ఎత్తలేదు. ఎన్నిసార్లు పెళ్లి గురించి ప్రశ్నించినా.. ఏదో ఒకటి చెబుతూ తప్పించుకున్నాడు. అయితే ఫైనల్ గా విశాల్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. కోలీవుడ్ స్టార్ హీరో చెల్లెలితో విశాల్ పెళ్లి ఫిక్స్ అయింది. ఇంతకీ ఆమె మరెవరో కాదు.. లక్ష్మీ మీనన్. ఈమె ఒకప్పుడు స్టార్ హీరోయిన్. మలయాళ, తమిళ భాషల్లో అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించింది.
2015లో వచ్చిన సూపర్ హిట్ మూవీ వేదాళంలో అజిత్ కుమార్ కు లక్ష్మీ మీనన్ చెల్లెలుగా కూడా నటించింది. త్వరలోనే చంద్రముఖి 2తో ప్రేక్షకులను పలకరించబోతోంది. అయితే 27 ఏళ్ల లక్ష్మీ మీనన్ మరికొద్ది రోజుల్లో విశాల్ తో ఏడడుగులు వేయబోతోందని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. వీరిద్దరూ జంటగా పల్నాడు, ఇంద్రుడు వంటి సినిమాల్లో నటించారు. ఈ సినిమాల ద్వారా ఏర్పడ్డ స్నేహం.. ఇప్పుడు ప్రేమగా మారిందట. కొద్ది నెలల నుంచి సీక్రెల్ గా విశాల్, లక్ష్మీ మీనన్ లవ్ చేసుకుంటున్నారట. ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్న ఈ జంట.. ఫైనల్ గా వివాహం చేసుకోవాలని డిసైడ్ అయ్యారని ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజమో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సిందే.