ప్రస్థానం సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు నటుడు అజయ్ ఘోష్. సినిమాలలో విలన్ పాత్రతో ప్రేక్షకులను అలరించాడు అజయ్. అయితే అజయ్ సినిమాల్లోకి రావడానికి చాలా కష్టాలు పడుతూ చెప్పులు అరిగేలా తిరిగాడట. అప్పుడే ప్రస్థానం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఆ తరువాత జ్యోతిలక్ష్మి అనే సినిమాతో ఇంకాస్త చేరువయ్యాడు. కానీ ఆ సినిమా తర్వాత అవకాశాలు కరువైపోయాయడట.చేసేది ఏమీ లేక పొట్టకూటి కోసం కూలి పనులు కూడా చేశాడట అజయ్ ఘోష్
అప్పుడు సినీ అవకాశాలు లేని టైంలో ఏం చేయాలో తెలియకపోవటంతో కాస్త నాకు టైం కలిసి వచ్చిందనే చెప్పాలి అదేంటంటే రంగస్థలం సినిమాలో ఒక అవకాశాన్ని రావటం తనకు ఆనందాన్ని కలిగించిందట.ఈ అవకాశాన్ని కల్పించింది సుకుమార్..ఆ తరువాత పుష్ప సినిమాలో ఒక కీలకమైన పాత్రను ఇచ్చి నన్ను అలా పైకి లేపారు. సుకుమార్, పూరి జగన్నాథ్ తమిళంలో విట్రీ మారన్ అనే దర్శకుల సినిమాలలో నటించాను. వీరు అవకాశం ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను.నాకు సినిమా అవకాశాలు రాకపోతే నేను ఈ స్టేజిలో ఉండేవాడిని కాదు..
కాబట్టి నాకు ప్రస్థానం సినిమా ఇచ్చిన దేవకట్టా గారికి అలాగే నేను నటించిన నాకు అవకాశాలు ఇచ్చిన దర్శకులందరికీ నా కృతజ్ఞతలు అంటూ అజయ్ ఘోష్ తెలిపారు. అజయ్ ఘోష్ ఇప్పుడు బేదురులంక అనే సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. అందులో కూడా నాది చాలా మంచి పాత్ర అంటూ చెప్పుకొచ్చారట. స్వయానా ఈ మాటలన్నీ అజయ్ ఘోష్ తెలిపారు. ఏదేమైనా అజయ్ కి మంచి అవకాశాలు రావాలని అలాగే గుర్తుండిపోయే చిత్రాలలో తనకు ఛాన్స్ రావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.