శోభితా ధూళిపాళ.. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అక్కర్లేదు. ఏపీలోని అచ్చ తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన శోభితా.. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. 2016లో అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన `రామన్ రాఘవ్ 2.0` తో సినీ రంగ ప్రవేశం చేసింది. తక్కువ సమయంలో బాలీవుడ్ లో మంచి నటిగా పేరు సంపాదించుకుంది. గూఢచారి మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే ఆకట్టుకుంది.
రీసెంట్ గా విడులైన పొన్నియిన్ సెల్వన్ లోనూ మెరిసిన శోభితా.. ప్రస్తుతం బాలీవుడ్, హాలీవుడ్ భాషల్లో నటిస్తోంది. ఇకపోతే సినిమాల ద్వారానే కాకుండా నాగచైతన్యతో లవ్ ఎఫైర్ రూమర్ల ద్వారా కూడా బాగా పాపులర్ అయిన శోభితా.. కెరీర్ ఆరంభంలో చాలా కష్టాలు పడిందట. ఎన్నో అవమానాలను ఎదుర్కొందట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శోభితా.. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది.
`ఏ రంగంలోనైనా ఆరంభం యుద్దంలా అనిపిస్తుంది. నేను యాడ్స్ లో నటించేటప్పుడు నువ్వు నల్లగా ఉన్నావు, అందంగా లేవు.. మా యాడ్ కు నువ్వు పనికి రావు అని ముఖం మీదే చెప్పేవారు. వారి మాటలు నన్ను ఎంతగానో బాధించాయి. అయినా నా దృష్టిలో అందమనేది ఎదుటవారి ఆలోచనలకు సంబంధించిన అంశం. అందుకే నేను ఎప్పుడూ క్రియేటివ్ గా ఉండటం..కొత్తగా ఉండటం కోసం ప్రయత్నించేదాన్ని. చేసే పనిని మరింత శ్రద్ధగా చేస్తాను. అదే నన్ను ఇండస్ట్రీలో భాగమయ్యేలా చేసింది. గుర్తించేలాగా చేసింది.` అంటూ శోభితా చెప్పుకొచ్చింది. దీంతో ఈమె కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి.