మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ 2021 సెప్టెంబర్ లో బైక్ యాక్సిడెంట్ కు గురైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తేజ్ ను సయ్యద్ అబ్దుల్ ఫర్హాన్ అనే వ్యక్తి రక్షించాడు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చావు అంచుల్లోకి వెళ్లిన తేజ్ ను వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లారు అబ్దుల్. ఈ భారీ ప్రమాదం నుంచి చాలా రోజులకు కోలుకున్న తేజ్.. రీసెంట్గా `విరూపాక్ష` వంటి బ్లాక్ బస్టర్ హిట్ తో కంబ్యాక్ ఇచ్చాడు. అయితే తేజ్ ను కాపాడిన అబ్దుల్ కు మెగా ఫ్యామిలీ అర్థికంగా సాయం చేసిందని గతంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
రీసెంట్ తో ఓ ఇంటర్వ్యూలో తేజ్ తనను కాపాడిన అబ్దుల్ కు డబ్బులిచ్చి చేతులు దులుపుకోలేనని.. అందుకే అతడికి తన ఫోన్ నెంబర్ ఇచ్చానని, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కాల్ చేయమని చెప్పినట్లు వెల్లడించారు. ఈ వ్యాఖ్యలపై అబ్దుల్ స్పందించాడు. సాయి ధరమ్ తేజ్ను కాపాడిన తర్వాత ఎవ్వరూ తనను కాంటాక్ట్ అవ్వలేదని, ఎవరి ఫోన్ నెంబర్ తనకు ఇవ్వలేదని కుండబద్దలు కొట్టాడు.అలాగే మెగా ఫ్యామిలీ తనకు అర్థికంగా సాయం చేశారన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశాడు. ఇతడి కామెంట్స్ నెట్టింట వైరల్ కావడంతో.. సాయి ధరమ్ తేజ్ అబద్ధం చెప్పాడా ?.. ప్రాణాలు కాపాడిన వ్యక్తికి కనీసం సాయం చేయలేదా ? అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పించారు.
దీంతో తేజ్ లేట్ చేకుండా వెంటనే సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. `నా గురించి.. నా టీం గురించి బయట అసత్య ప్రచారం జరుగుతోందనే వార్తలు నా వద్దకు చేరాయి. ఈ వీడియోలో మీరు చూస్తున్నట్లుగా.. అబ్దుల్ కు మేం సాయం చేశామని ఎప్పుడూ చెప్పుకోలేదు. అతడు చేసిన సాయానికి నేను, నా కుటుంబం ఎప్పుడూ రుణపడి ఉంటాం. అతడి వద్ద మా డీటైల్స్.. మా కాంటాక్స్ డీటైల్స్ ఉన్నాయి. అతడికి ఎప్పుడూ ఏ అవసరం వచ్చినా కూడా కాంటాక్ట్ అవ్వొచ్చు. మా మేనేజర్ శరణ్ అతడితో ఎప్పటికీ టచ్ లోనే ఉంటాడు. ఈ విషయం మీద నేను స్పందించడం ఇదే చివరిసారి అవుతుంది` అంటూ ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఈ ట్వీట్ కాస్త వైరల్ గా మారింది.
To whomsoever it may concern..
Thank You
Sai Dharam Tej. pic.twitter.com/qJr3SYYJ6B
— Sai Dharam Tej (@IamSaiDharamTej) April 27, 2023