టాలీవుడ్ హీరోయిన్ సమంత ధరించే దుస్తులు, ఆభరణాలపై అందరికీ ఆసక్తి ఉంటుంది. ఆమె ఏది ధరించినా దానికో ప్రత్యేకత ఉండేలా చూసుకుంటుంది. ముఖ్యంగా ఆమె నటనతో పాటు డ్రెస్సింగ్ సెన్స్కు చాలా మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఏ మాయ చేశావే సినిమాలో ఆమె ధరించిన చీరలకు చాలా మంది ఫిదా అయిపోయారు. ఆమెకు అభిమానులుగా మారిపోయారు. సమంత తన డ్రెస్సింగ్ సెన్స్, స్టైల్తో తరచుగా ప్రయోగాలు చేస్తుంటారు. తాజాగా ప్రియాంక చోప్రా ధరించిన సిటాడెల్ వెబ్ సిరీస్ ఫంక్షన్ సమంత హాజరయ్యారు. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్తో కలిసి వేడుకకు ఆమె వచ్చింది. వచ్చీ రావడంతోనే అందరి చూపును తన వైపునకు తిప్పుకుంది.
ఈ ప్రీమియర్ వేడుకకు సమంత ధరించిన దుస్తులు, ఆభరణాలు చాలా ఖరీదైనవి. సమంత బ్లాక్ స్కర్ట్, క్రాప్ టాప్తో పాటు స్నేక్ డిజైన్ ఉన్న డైమండ్ నగలను వేసుకుంది. ఈ సరికొత్త లుక్లో సమంత చాలా ఆకర్షణీయంగా దర్శనమిచ్చింది. సమంత తన స్కర్ట్ను క్రాప్ టాప్తోనూ, విక్టోరియా బెక్హామ్ డాల్మన్ స్లీవ్, స్కాలోప్డ్ హెమ్లైన్తో జత చేసింది. ఈ దుస్తుల ధర దాదాపు రూ. 17,000లు ఉంటుందని తెలుస్తోంది. మరో వైపు ఆమె ఓ డైమండ్ నెక్లెస్ ధరించింది. దాని ధర ఏకంగా 2.9 కోట్ల రూపాయలుగా ప్రచారం సాగుతోంది. పాముల రూపంలో ఉండే డైమండ్ బ్రాస్లెట్ ధరించింది. ఇక ధర ఏకంగా రూ.2.6 కోట్లు. మొత్తానికి ఈ వేడుకలో సమంత ధరించిన దుస్తులు, ఆభరణాలకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె ఇటీవల నటించిన శాకుంతలం సినిమా ఆశించిన స్థాయిలో విజయం దక్కించుకోలేకపోయింది.
మరో వైపు విజయ్ దేవరకొండ సరసన ఖుషీ సినిమా చేస్తోంది. దీంతో పాటు సిటాడెల్లో ఆమె కీలక పాత్ర చేయనున్నట్లు సమాచారం. మరోవైపు శాంకుంతలం సినిమా పరాజయంతో పౌరాణిక పాత్రలకు దూరంగా ఉండాలని ఆమె నిర్ణయించుకున్నట్లు సమాచారం. అవసరమైతే బోల్డ్ సీన్లలో సైతం నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సంకేతాలు ఇస్తోంది. మయోసైటిస్ బారి నుంచి కోలుకుని సినీ రంగంలో మరింత బిజీ కావాలని యోచిస్తోంది.