నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శ్రీదేవి మూవీస్ సంస్థ నిర్మించిన సినిమా ‘ఆదిత్య 369’. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. నిర్మాతగా శివలెంక కృష్ణప్రసాద్ రెండో చిత్రమిది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ నేపథ్యంలో వచ్చిన మొదటి ఇండియన్ సైన్స్ ఫిక్షన్ సినిమా కూడా ఇదే. ఇక ఈ సినిమాలో పని చేసిన నటీనటులో హీరోయిన్ మోహిని గురించి మాట్లాడుకోవాలి.
ఇక ఈమె తెలుగులో నటించిన తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ అందుకోవడంతో ఇక వరుస చిత్రాలతో స్టార్ హీరోయిన్ అయింది. ఆమె నటించిన అన్ని భాషల్లో కూడా స్టార్ హీరోయిన్ గా తన సత్తా చాటింది. అయితే సినీ జీవితంలో మనకు తెలియకుండానే ముగిసిపోతుంది. ఇక మోహిని జీవితంలో కూడా పెళ్లి రూపంలో సినీ జీవితానికి బ్రేక్ పడింది.
భరత్ అనే వ్యక్తితో మ్యారేజ్ అవ్వడంతో అమెరికాకు వెళ్ళిపోయింది. వాళ్లకి ఇద్దరు పిల్లలు. ఎంతో హాయిగా ,సాఫీగా జీవితం సాగిపోతోన్న సమయంలో మోహినికి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. నిజానికి కొడుకు పుట్టాక ఆమెకు నరాలకు సంబంధించిన వ్యాధి సోకింది. ఆ సమస్యతో చాలాకాలం ఇబ్బంది పడింది.. ఆ తర్వాత ఆమె జీవితంలో ఎవరు ఊహించని సంఘటన జరిగింది.
స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగిన మోహిని అప్పటివరకు ఎంతో సాంప్రదాయ బద్దంగా పూజలు పురస్కారాలు చేస్తూ జన జీవితాన్ని కొనసాగించేది. అక్కడే ఎవరు ఊహించని విధంగా క్రైస్తవం తీసుకుని తన పేరును కూడా మార్చేసుకుంది. తనలా జీవితంలో కష్టాలు ఎదుర్కొన్న వారికి అండగా నిలుస్తూ, వారికోసం ప్రార్థనలుు చేస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తుంది.