మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో `SSMB28` వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది.
ఇందులో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహో గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా కథకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది.
రొటీన్ రొట్ట కథతో త్రివిక్రమ్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడట. ఇదొక రివేంజ్ స్టోరీ అని.. ఇందులో మహేష్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని.. అయితే ఒక పాత్ర చనిపోతే మరొక పాత్ర ప్రత్యర్థులపై పగ తీర్చుకుంటుందని ప్రచారం జరుగుతుంది. ఇంచుమించుగా బాలకృష్ణ నటించిన `వీర సింహ రెడ్డి`కథను పోలి ఉంటుందని టాక్ నడుస్తోంది. మరి నిజంగా ఇదే కథ అయితే.. సినిమా ఫలితం ఎలా ఉంటుందో అని మహేష్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.