శ్రీకాంత్ ఓదెల.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ నూతన డైరెక్టర్ పేరు మారుమోగిపోతోంది. ప్రముఖ స్టార్ డైరెక్టర్ సుకుమార్ వద్ద వర్క్ చేసిన శ్రీకాంత్ ఓదెల.. ఇటీవల విడుదలైన `దసరా` మూవీతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. తొలి సినిమాతోనే ఎన్నో సంచలనాలను సృష్టిస్తున్నాడు.
నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. విడుదలైన నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిన ఈ చిత్రం.. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద లాభాల బాట పడ్డింది.
ఈ సినిమాతో మంచి సత్తా ఉన్న దర్శకుడిగా పేరు సంపాదించుకున్న శ్రీకాంత్ ఓదెలకు తాజాగా నిర్మాత సుధాకర్ చెరుకూరి ఖరీదైన బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్ గా ఇచ్చారని తాజాగా ఓ న్యూస్ తెరపైకి వచ్చింది. ఇక ఆ కారు ధర తెలిస్తే షాకైపోతారు. ఎందుకంటే, ఆ కారు విలువ రూ. 80 లక్షలు అని అంటున్నారు. ఏదేమైనా తొలి సినిమాతోనే అంత ఖరీదైన కారును గిఫ్ట్ గా అందుకోవడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. మరి శ్రీకాంత్ ఓదెల తరపరి చిత్రం ఏ హీరోతో ఉండబోతోంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.