ఎమ్మెల్యేలకు క్లాస్ లేదా? జగన్ కొత్త రూట్‌లో!

ఇప్పటివరకు వైసీపీకి తిరుగులేదనే పరిస్తితి..కానీ ఇటీవల మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ ఓడిపోవడం…అనూహ్యంగా ఒక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానంలో టి‌డి‌పి గెలవడం, నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టి‌డి‌పికి క్రాస్ ఓటింగ్ చేసిన నేపథ్యంలో..తాజాగా జగన్ పెట్టే వర్క్ షాప్ ఏ విధంగా సాగుతుందనే చర్చ అందరిలో సాగుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన వర్క్ షాపులు వేరు..ఇప్పుడు జరిగేది వేరు.

గత ఏడాది జరిగిన వర్క్ షాపులో జగన్ పదే పదే ఎమ్మెల్యేలకు క్లాస్ ఇస్తూ వచ్చారు. ఎమ్మెల్యేలంతా గడపగడపకు వెళ్లాలని, ప్రజల్లోనే ఉండాలని సూచిస్తూ వచ్చారు. అలా తిరగని వర్క్ గట్టిగానే క్లాస్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు ఇకనైనా తిరగాలని చెబుతూ వచ్చారు. అలా ప్రజల్లోకి వెళ్లనివారిని, పనితీరు బాగోని వారికి నెక్స్ట్ ఎన్నికల్లో సీటు ఇచ్చే ప్రసక్తి లేదని జగన్ తేల్చి చెప్పేస్తున్నారు. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలకు సీటు విషయంలో క్లారిటీ ఇచ్చినట్లే కనిపిస్తున్నారు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలో టి‌డి‌పికి క్రాస్ ఓటు చేశారు.

ఎవరైతే వైసీపీలో సీటు దక్కదో వారు టి‌డి‌పిలోకి వెళ్లడానికి చూస్తున్నారని తెలిసింది. ఇప్పటికే చంద్రబాబు..వైసీపీ ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని బాంబు పేల్చారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న వర్క్ షాపులో జగన్..ఎమ్మెల్యేలకు క్లాస్ ఇచ్చే సాహసం చేయరనే చెప్పవచ్చు. ఎందుకంటే అలా చేస్తే మళ్ళీ వైసీపీక్ దెబ్బపడుతుంది. అందుకే జగన్ ఎమ్మెల్యేలని మందలించకుండా..సెంటిమెంట్ తో దగ్గర చేసుకుని, మళ్ళీ పార్టీని బలోపేతం చేసే దిశగా తీసుకెళ్తారని తెలుస్తోంది.

అలా కాకుండా మళ్ళీ క్లాస్ ఇచ్చి..ఎమ్మెల్యేలకు సీట్లు లేవని చెబితే…వారు మళ్ళీ వేరే దారి చూసుకునే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి జగన్ ఏం చేస్తారో.e