ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేల పనితీరుపై సిఎం జగన్ సమీక్షా చేస్తున్న విషయం తెలిసిందే. క్షేత్ర స్థాయిలో ఎమ్మెల్యేల పనితీరుపై రిపోర్టులు తెప్పించుకుని, వారిని సమావేశపరిచి..వారి పనితీరుపై ఎప్పటికప్పుడు క్లాస్ పీకుతున్నారు. ప్రధానంగా గడపగడపకు విషయంలో గట్టి క్లాస్ ఇస్తున్నారు. ప్రతి ఒక్కరూ గడపగడపకు వెళ్ళాల్సిందే అని టార్గెట్ పెట్టారు. దీంతో ఎవరైతే గడపగడపకు వెళ్లారో వారికి గట్టి క్లాస్ ఇస్తూ..రాబోయే రోజుల్లో మరింత ఎఫెక్టివ్ గా పనిచేయాలని చెబుతున్నారు.
అయితే ఇప్పటికే జగన్ పలుమార్లు గడపగడపపై రివ్యూలు పెట్టారు. సరిగ్గా పనిచేయని వారికి క్లాస్ ఇచ్చారు. అలాగే ఇదే కొనసాగితే సీటు కూడా ఇవ్వనని చెప్పారు. ఇప్పటికే పలుమార్లు క్లాస్ తీసుకున్న మారని వారికి ఇంకా జగన్ చెక్ పెట్టేస్తారని తెలుస్తోంది. ఇదే క్రమంలో ఏప్రిల్ 3న జరగనున్న సమావేశంలో జగన్..సీట్లు విషయంపై తేల్చేస్తారని తెలుస్తోంది. పైగా ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయనే నేపథ్యంలో సీట్లు ఎవరికి దక్కవో తేల్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.
గత వర్క్షాపులోనే గడప గడపకు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనని మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లను బాహాటంగానే చదివి వినిపించారు. ఈ జాబితాలో దాదాపు 64 మంది ఉండడం గమనార్హం. మరి ఈ సారి ఎంతమంది బయటపడతారో చూడాలి. అలాగే మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడం, ఒక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో ఓడిపోవడంపై సమీక్షా చేసే ఛాన్స్ ఉంది.
అయితే సీట్ల విషయం జగన్ ఇప్పుడే తేల్చడం అనేది కష్టమని చెప్పవచ్చు. అలా తేల్చినందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపికి క్రాస్ ఓటు వేశారు. ఇప్పుడు ఓపెన్ గా సీటు ఇవ్వనని చెప్పేస్తే..ఎమ్మెల్యేలు జంపింగ్ రెడీ అవ్వవచ్చు. అందుకే ప్రస్తుతానికి సీట్ల విషయం తేల్చడం కష్టమే అని చెప్పవచ్చు.