ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నారు. గ్యాప్ లేకుండా వరుస షెడ్యూల్స్ లో బిజీగా ఉన్న ప్రభాస్ ఆది పురుష్ -3d మూవీ ఇటీవల పూర్తి కాగా సినిమా నిర్మాణంలో కాస్త నాణ్యత కోసం రిలీజ్ తేదీని వాయిదా వేయడం జరిగింది. ఇటీవలే సలార్ సినిమాను కూడా పూర్తి చేయడం జరిగింది. కాస్త విరామం తీసుకున్న ప్రభాస్ తిరిగి సినిమా షూటింగ్ కి సిద్ధమవుతున్నారు. కానీ ఇంతలోనే ప్రభాస్ పైన పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలుసుకుందాం.
ప్రభాస్ బాహుబలి సినిమాల తర్వాత ఒక రేంజ్ మారిపోయిందని చెప్పవచ్చు. ఇండియాన్ స్టార్ అయినప్పటికీ కూడా నిత్యం వార్తల్లోనే నిలుస్తూనే ఉన్నారు. అటు దక్షిణాది ఇటు ఉత్తరాది మీడియాలో కూడా ప్రభాస్ పైన ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాయి. ముఖ్యంగా హీరోయిన్లతో ప్రేమ వ్యవహారాలు గురించి లేకపోతే.. అనారోగ్య సమస్యల గురించి.రెమ్యూనరేషన్ గురించి ఇలా పలు రకాలుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక హీరోయిన్లతో ఎఫైర్ వంటి వాటిపై స్పందించమని కోరితే ప్రభాస్ ఎప్పుడు వాటిని అంగీకరించలేదు.
కేవలం వారితో నేను స్నేహంగా మాత్రమే ఉంటానని తెలిపారు. ఇక ఇటీవలే కృతి సనన్ తో నిశ్చితార్థం మాల్దీవుల్లో జరగబోతోంది అనే వార్తలు వినిపించాయి. అలాగే షూటింగ్ నుంచి గ్యాప్ గ్యాప్ తీసుకోగానే తీవ్రమైన జర్వంతో బాధపడుతున్నట్లుగా వార్తలు వినిపించాయి. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదన్న విషయం ప్రభాస్ సన్నిహితుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. బిజీ సినిమాల షెడ్యూల్ కారణంగా కాస్త విశ్రాంతి తీసుకోవాలనుకున్నప్పుడల్లా ప్రభాస్ అనారోగ్యానికి గురయ్యారని పుకార్లు మొదలవుతున్నాయని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రభాస్ పైన వచ్చే వార్తలన్నీ కూడ వట్టి పుకార్లే అన్నట్లుగా తెలుస్తోంది.