రోజు రోజుకి దిగజారి పోతున్న పూజా హెగ్డే పరిస్థితి..!!

టాలీవుడ్ లో హీరోయిన్ పూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ పేరు తెలియని తెలుగు రాష్ట్ర ప్రేక్షకులు ఉండాలని చెప్పవచ్చు. ముకుందా సినిమాతో మొదటిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత అలా వైకుంఠపురం చిత్రంతో మంచి క్రేజ్ ను అందుకుంది. ఇలా అతి తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ గా పేరు సంపాదించింది పూజ హెగ్డే. స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. మొదట్లో ఈమె ఏ సినిమాలలో ఉంటే ఆ సినిమా ఫ్లాప్ అనే ప్రచారం జరిగింది.

Exclusive: 'Radhe Shyam' star Pooja Hegde says she was a 'tomboy', reveals  destiny's role in her becoming an actressఐరన్ లెగ్ హీరోయిన్ అంటూ కూడా విమర్శలు ఎదుర్కొంది. అందం ఉన్న నటించగలిగే సత్తా ఉన్నప్పటికీ సరైన సినిమాలు చేయలేక చాలా ట్రోల్కు కూడా గురైంది. ఆ తర్వాత ఎన్టీఆర్ తో వచ్చిన అరవింద సమేత సినిమా ఈమె కేర్ కు మంచి ప్లస్ అయ్యింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఈమెలో ఉన్న ఐరన్ లెగ్ విమర్శ తొలగిపోయింది. ఆ తర్వాత వెంట వెంటనే బ్లాక్ బస్టర్ విజయాలను అందుకోవడంతో పూజ హెగ్డే కెరియర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. దీంతో బుట్ట బొమ్మగా కూడా పేరు సంపాదించింది.

కరోనా తర్వాత పూజ హెగ్డే క్రేజ్ క్రమంగా తగ్గుతూ వస్తోందని చెప్పవచ్చు. ఆమె చేసిన ఏ సినిమాలు కూడా సక్సెస్ కాలేకపోయాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ లోకి వెళ్లిపోవడంతో ఇక్కడ తెలుగు డైరెక్టర్ లతో టచ్ లో లేకపోయేది. అలా టాలీవుడ్లో సినిమాలు లేక ప్రస్తుతం ఖాళీగా ఉంటుందని సమాచారం. ఆమె గతంలో రూ .3కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకునేదట. కానీ ఇప్పుడు ఈమె చేతిలో అవకాశాలు లేకపోవడంతో ఇందులో కూడా తగ్గిపోయింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం మహేష్ బాబు సినిమా తప్ప మరో సినిమాలో నటించలేదు పూజా హెగ్డే.