పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈయన మరో సినిమాకు సైన్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నాడట. ఈ సినిమాకు డైరెక్టర్ కూడా ఫిక్స్ అయ్యాడు.
ఇంతకీ ఆ డైరెక్టర్ మరెవరో కాదు ప్రశాంత్ నీల్. ఆల్రెడీ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో `సలార్` అనే ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతోంది. షూటింగ్ కూడా ఆఖరి దశకు చేరుకుంది. అయితే మరోసారి వీరి కాంబో రిపీట్ కాబోతోందని తెలుస్తోంది. తాజాగా దిల్ రాజు ఓ ప్రమోషనల్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో `రావణం` అనే టైటిల్ తో ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు వెల్లడించారు.
అత్యంత భారీ బడ్జెట్ లో కళ్ళు చెదిరే విఎఫెక్స్ తో ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలిపారు. పీరియాడిక్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించబోతున్నాడట. త్వరలోనే ఈ బిగ్ ప్రాజెక్ట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని తెలుస్తోంది.