యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. RRR చిత్రంతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ అందుకున్న ఎన్టీఆర్ పలు దేశ విదేశాలలో కూడా సూపర్ క్రేజ్ ని సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎన్టీఆర్ గురించి మంచు లక్ష్మి చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. RRR చిత్రంలో ఎన్టీఆర్ రోల్ చేసి ఫిదా అయినా ప్రేక్షకులు అంతర్జాతీయంలో ఎన్టీఆర్ పాపులారిటీ మరింత రెట్టింపు అయ్యిందని చెప్పవచ్చు.
ఇండియన్ ఫిలిం హిస్టరీ లోనే ఒక గొప్ప నటుడుగా పేరు పొందిన ఎన్టీఆర్.. వెరైటీ మ్యాగ్జైన్ బెస్ట్ యాక్టర్ ఆస్కార్ ప్రిడిషన్స్ లిస్టులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాప్ ప్లేస్ లో నిలిచారు. ఇకఎన్టీఆర్ సాధించిన ఒక అరుదైన ఘనత అని చెప్పుకోవచ్చు. భారతీయ నటుడు అయ్యిండి టాప్ ప్లేస్ లో 10 ఉత్తమ నటుల అంచనా జాబితాలలో చోటు సంపాదించుకోవడం ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు. దీంతో ఎన్టీఆర్కు ఆస్కార్ రావడం పక్కా అంటూ ఎన్టీఆర్ అభిమానుల సైతం ఫుల్ ఖుషి అవుతున్నారు దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడం జరిగింది.
ఈ విషయంపై సినీ సెలబ్రిటీలు సైతం స్పందించకపోవడంతో మంచు లక్ష్మి సీరియస్ గా కామెంట్లు చేసింది. కొంతమంది సెలబ్రిటీలు ఎన్టీఆర్ కు కంగ్రాట్యులేషన్స్ చెప్పారు. కానీ చాలావరకు సెలబ్రెటీలు స్పందించలేదు. ఇదే మ్యాటర్ తీస్తూ మంచు లక్ష్మి ప్రశ్నిస్తోంది.. ఎన్టీఆర్ సాధించిన ఘనత చిన్న విషయం కాదు ప్రపంచ సినీ చరిత్రలోనే ఇది ఒక పెద్ద విజయం. ఇది మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకోవడం లేదు అందరూ ఎందుకు మౌనంగా ఉన్నారంటే మంచు లక్ష్మి తన ట్విట్టర్ నుంచి తెలియజేసింది. ఒకసారి హీరో హీరోయిన్ కూడా ఎన్టీఆర్ ని అభినందిస్తూ ట్విట్ చేయలేదు కానీ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో బీభత్సం సృష్టిస్తున్నారని తెలియజేస్తోంది.
Why aren’t we celebrating this more y’all! This is no small feat in the world of cinema. @tarak9999 whistles, claps and may more creative juices flow through you. 🥳🥳🥳🥳🥳🥳 https://t.co/wvyoxnLh8Q
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) January 6, 2023