2011 సంవత్సరంలో విడుదలైన కర్మ సినిమాతో మొదటిసారిగా అడవి శేషు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత హీరోగా అవకాశాలు రాకపోవడంతో పంజా, బలుపు, బాహుబలి, రన్ రాజా రన్ వంటి సినిమాలలో సైడ్ క్యారెక్టర్ లలో నటించారు. ఇక 2016లో క్షణం సినిమాతో తన కెరియర్ మారిపోయింది. డైరెక్టర్ రవికాంత్ తో కలిసి అడవి శేషు ఈ సినిమా కథను సిద్ధం చేశారు. ఇక ఆ తర్వాత ఎవరు, గూడచారి ,మేజర్ వంటి వరుస సినిమా విజయాలతో పాన్ ఇండియా హీరోగా పేరు పొందారు.
ఇక రీసెంట్ గా వచ్చిన హీట్ -2 సినిమాతో మరొకసారి తన రేంజ్ ఏంటో చూపించారు. తాజాగా అడవి శేషు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. తెలుగులో ప్రతి కుటుంబం నుంచి పదిమంది హీరోలు ఉన్నారని ఇలాంటి పరిస్థితులలో బయట వ్యక్తికి మంచి స్క్రిప్ట్ దక్కడం చాలా కష్టమని తెలియజేశారు. అలాగే ఒక సినిమా ఫలితాన్ని తాను ఎలా తీసుకుంటాడో ఈ సందర్భంగా వివరించారు. తను నటించిన సినిమా ఫ్లాప్ అయితే కచ్చితంగా డిప్రెషన్ కు గురవుతానని తెలిపారు.
రిజల్ట్ విషయంలో చాలా ప్రాక్టికల్ గా ఉంటానని ఎన్నోసార్లు స్క్రిప్ట్ విషయంలో దొరలే తప్పులను కరెక్ట్ చేసుకుంటూ ఉంటానని.. అయితే మంచి స్క్రిప్టుల కోసం చాలా కాలం ఎదురు చూసి విసిగిపోవడం వల్ల తాను రైటింగ్ లోకి రావడానికి కారణమని అడవి శేషు తెలిపారు. ఏ సినిమాలోనైనా సరే లీడ్ రోల్స్ తో పాటు ఇంపార్టెంట్ రోల్స్ కూడా ఆల్రెడీ సెలెక్ట్ అయిపోతాయని కనీసం ప్రాముఖ్యత లేని పాత్రలకు మాత్రమే ఇక్కడ ఆడిషన్స్ జరుగుతూ ఉంటాయని అడివి శేషు తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.