ప్రస్తుతం ఇప్పుడు ఉన్న హీరోయిన్లకు చాలామందికి నటించడం రాదని విమర్శలు బాగా వస్తున్నాయి. ఆ విమర్శలను నిజమనే విధంగా కొన్ని సినిమాల్లో వాళ్ళ యాక్టింగ్ చూస్తుంటే మనకు చిరాకు వస్తుంది. మన పాత తరం నటీమణులలో సావిత్రి, జమున, అంజలీదేవి లాంటివారు తమ నటనతో హీరోలను సైతం వెనుక్కున్నట్టే వారు.. వారి తర్వాత వచ్చిన నటీమణులు విజయశాంతి, రాధా, సుహాసిని, సుమలత, భానుప్రియ లాంటి హీరోయిన్స్ కూడా తమ నటనతో మంచి క్రేజ్ను కూడా దక్కించుకున్నారు. ఆ తర్వాత వారిలో సౌందర్య, రమ్యకృష్ణ, రంభ, సిమ్రాన్, రోజా వంటి హీరోయిన్లు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు.
కానీ ఇప్పటి జనరేషన్ హీరోయిన్స్ మాత్రం తమ నటన కన్నా తమ గ్లామర్ షో తో మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. సమంత, కీర్తి సురేష్, నయనతార, త్రిష, తమన్నా, రష్మిక మందన, పూజా హెగ్డే వంటి వారు మంచి పెర్ఫార్మెన్స్ చేస్తున్నా అది ప్రేక్షకులను మెప్పించలేక పోతుంది. అయితే ఇప్పుడు వీరందరికీ పాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్ ఉన్నప్పటికీ.. వారిలో కొందరు హీరోయిన్స్ మాత్రం రొమాంటిక్ హీరోయిన్లుగా పేరు తెచ్చుకుంటున్నారు.
అలా పేరు తెచ్చుకున్న వారిలో నటన అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది. అలా నటన కన్నా తమ అందంతో మొదటి సినిమాతోనే అకట్టుకుని ఇప్పుడు ఆఫర్లు లేక ఖాళీగా ఉన్న హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్కు జంటగా షాలిని పాండే నటించింది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈమే తర్వాత నుంచి అవకాశాలు రాక ఇబ్బంది పడుతుంది.
ఇక ఆర్ ఎక్స్ 100 సినిమాతో హీరోయిన్గా పరిచయమైన పాయల్ రాజ్ పుత్ కూడా అదే పరిస్థితి. వీరితోపాటు నిధి అగర్వాల్, నభా నటేష్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఇప్పటి తరం జనరేషన్ హీరోయిన్స్ కొందరు మాత్రం అవకాశాలు రాకపోయినా యాక్టింగ్ రాకపోయినా తమ రెమ్యూనరేషన్ విషయంలో వెసులుబాటు చూపించి సినిమా మొత్తం తమ హాట్ షో తో రొమాంటిక్ సీన్స్ కు ఓకే చెప్పి సినిమాలలో అవకాశాలు పట్టేస్తున్నారు. అయితే వీరు ఎక్కువ కాలం పరిశ్రమలో హీరోయిన్స్గా కొనసాగలేకాపోతున్నారు.