కన్నడ స్టార్ట్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ సినిమాలు విడుదలై ఎంతటి ప్రభంజనం సృష్టించాయో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషల్లో విడుదలై కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఈ సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరో యాశ్ యువతలో రాఖీభాయ్గా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ సినిమాల తర్వాత రాఖీభాయ్ తన తర్వాత సినిమా ఇంకా మొదలుపెట్ట లేదు దీంతో ఈయన తర్వాత సినిమా ఏ దర్శకుడితో చేస్తారంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలోనే యాశ్ తరవాత సినిమాలకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వార్త ఏమిటంటే యాశ్ తో సినిమాలు చేయడానికి బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్లు ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికే యాశ్ ముందుకు బాలీవుడ్ నుంచి రెండు మెగా ఆఫర్లు వచ్చాయని కూడా తెలుస్తుంది.
బాలీవుడ్ నుంచి వచ్చిన ఆఫర్లలో రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా తెరకెక్కిస్తున్న మహాభారతం ఆధారంగా కర్ణ అనే పౌరాణిక ఇతిహాసాన్ని పాన్ ఇండియా లెవెల్ లో రెండు భాగాలుగా ఆయన సినిమాగా తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రధాన పాత్ర కోసం సినిమా యూనిట్ యాశ్ ను కలిసినట్టు తెలుస్తుంది. అలానే బాలీవుడ్ నుంచి వచ్చిన భారీ చిత్రం బ్రహ్మాస్త్ర.. ఈ సినిమా విడుదలై భారీ కలెక్షన్ సొంతం చేసుకుంది. సినిమాను మూడు భాగాలుగా తీస్తానని దర్శక నిర్మాతలు ఎప్పుడో చెప్పారు. ఈ క్రమంలోనే రెండో భాగంలో ప్రధాన పాత్రైన దేవ్ పాత్రకు యాశ్ను నటించమని చిత్ర యూనిట్ కలిసినట్టు తెలుస్తుంది. ఈ రెండు భారీ ప్రాజెక్టులో యాశ్ ఏ సినిమాకు ఓకే చేస్తారో అనేది ఇంకా తెలియదు. యశ్ పుట్టినరోజు(జనవరి 8) నాటికైనా వీటికి సంబంధించిన అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉందని అభిమానులు అంచనా వేస్తున్నారు.