స్టార్ హీరోయిన్ సమంత .. తెలుగులో ‘ఏమాయ చేశావే’ సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసిన కుందనుపు బొమ్మ. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని అక్కినేని ఇంటి కోడలై .. పట్టుమని పదేళ్ళు కూడా కాపురం చేయకుండానే.. నాగ చైతన్యకు విడాకులు ఇవ్వడానికి సిద్ధపడి అందరికి షాక్ ఇచ్చింది. ఈ ప్రకటన తర్వాత సమంత పేరు ఎలా మారుమ్రోగిపోయిందో మనకు తెలిసిందే. లోకల్ మీడియా నేషనల్ మీడియాలో నెల రోజులు అమ్మడు విడాకుల మ్యాటర్ నే హాట్ టాపిక్ గా నిలిచింది.
వ్యక్తిగతంగా తన పై ఎంత ట్రోలింగ్ జరుగుతున్నా ..తాను మాత్రం వరుస సినిమాలకు సైన్ చేస్తూ తన పని తాను చూసుకుంటుంది. మరో వైపు తనకు నచ్చిన విధంగా డ్రెస్లు వేసుకుంటూ నచ్చిన వాళ్ళతో నచ్చిన ప్లేస్ లకు తిరుగుతూ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. ఈ మధ్యనే విడాకుల తరువాత మొదటిసారి తెర పై ఐటెం సాంగ్ తో కనిపించిన మెప్పించిన సమంత..ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో క్షణం కూడా తీరికలేకుండా బిజీ బిజీ గా గడిపేస్తుంది.
కాగా, సమంత ప్రధాన పాత్రలో శ్రీదేవీ మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘యశోద’. సైంటిఫిక్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది అంటూ ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంతోనే హరి-హరిష్ దర్శకులిగా పరిచయం కానుండడం మరో విశేషం. అయితే సమంత నటిస్తున్న ఈ చిత్రం గురించి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమా కోసం హైదరాబాద్లోని ఓ స్టూడియోలో దాదాపు మూడు కోట్ల రూపాయలతో సెవెన్స్టార్ హోటల్స్ సౌకర్యాలను తలపించేలా భారీ సెట్స్ వేశారట.
ఈ సినిమాను మలుపు తిప్పే కీలక సన్నివేశాలన్ని కూడా ఈ సెట్స్ లోనే చిత్రకరించనున్నట్లు తెలుస్తుంది. ఆర్ట్ డైరెక్టర్ అశోక్ నేతృత్వంలో రూపొందిన మూడుకోట్ల రూపాయల హోటల్ సెట్స్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. కాగా ఈ చిత్రంలో తమిళ నటి వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో గుణశేఖర్ దర్శకత్వంలో పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’ రిలీజ్ కు రెడీగా ఉండగా.. తమిళంలో విజయ్ సేతుపతి, నయనతారతో కలిసి నటించిన ‘కాత్తు వాక్కుల రెండు కాదల్’ చిత్రం కూడా విడుదలవడానికి సిద్ధంగా ఉంది.