టాలీవుడ్లో ఇద్దరు క్రేజీ హీరోలు అయిన యంగ్టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా త్రిబుల్ ఆర్. రౌద్రం రణం రుధిరం ట్యాగ్ లైన్తో వస్తోన్న ఈ సినిమాపై పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రాజమౌళి బాహుబలి – ది కంక్లూజన్ సినిమా తర్వాత డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో పాటు టాలీవుడ్లోనే క్రేజీ హీరోలుగా ఉన్న ఎన్టీఆర్, రామ్చరణ్ కాంబినేషన్లో వస్తోన్న సినిమా కావడం.. ఇటు రు. 450 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన సినిమా కావడంతో త్రిబుల్ ఆర్పై మామూలు అంచనాలు లేవు.
14 భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం తెలుగు సినీ జనాలు, అభిమానులే కాకుండా.. దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు అందరూ ఎంతో ఆసక్తితో వెయిటింగ్లో ఉన్నారు. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్కు రెడీ అవుతోంది. ఇప్పటికే ఓ సారి భారీ ఎత్తున ప్రమోషన్లు కంప్లీట్ చేశారు. ఇక ఇప్పుడు మరోసారి ఈ సినిమా ప్రమోషన్లు భారీ ఎత్తున షురూ చేస్తున్నారు.
కొత్త రిలీజ్ డేట్ వచ్చాక మూడు , నాలుగు రోజులు కాస్త హడావిడి కనిపించినా మళ్లీ మేకర్స్ సైలెంట్ అయ్యారు. ఇక ఇప్పుడు మరో రెండు బిగ్ అప్డేట్స్తో సినిమాకు హైప్ తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమా యూనిట్ నుంచి వినిపిస్తోన్న టాక్ ప్రకారం మార్చి 9 న మరియు 14 న రెండు బిగ్ అప్డేట్స్ రాబోతున్నాయట. ఈ రెండు అప్డేట్స్ సినిమాపై హైప్ను మరింత పెంచేవే అంటున్నారు. మరి ఈ రెండు అప్డేట్స్ ఏంటన్నది చూడాలి.