సమంత – నాగ చైతన్య తో ప్రేమలో పడి ఆ తర్వాత పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే నాగ చైతన్య తో ప్రేమలో పడక ముందు సమంత సినీ ఇండస్ట్రీ లో ఉండే దర్శకులతో, నిర్మాతలతో చాలా సన్నిహితంగా ఉండేది. కానీ ఎప్పుడైతే నాగచైతన్య తో వివాహం జరిగిందో ఇక అప్పటి నుంచి ఆమె అక్కినేనివారి కోడలిగా అందరితో బిహేవ్ చేసేది. ఒక హీరోయిన్ అనే విషయాన్ని మర్చిపోయి దర్శక నిర్మాతలతో అవసరం ఉంటుంది అనే విషయాన్ని కూడా పక్కనపెట్టి, ఒక్కసారిగా నాగచైతన్యతో పెళ్లి జరిగిన తరువాత వీరందరితో మాట్లాడటం మానేసింది.
అంతేకాదు దర్శకనిర్మాతలు కలగజేసుకుని సమంతతో మాట్లాడినప్పటికీ ,ఆమె తనదైన శైలిలో వీరందరినీ దూరం పెట్టింది అని సమాచారం.. గతంలో ఉండే సమంతకు ,పెళ్లయిన తర్వాత సమంతకు చాలా తేడాలు వచ్చాయి అంటూ దర్శక నిర్మాతలు కూడా దూరమయ్యారు. ఇకపోతే ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ కు సమంతకు మంచి సన్నిహితం ఉండేది. అప్పట్లో సమంత కూడా త్రివిక్రమ్ ను చాలా ప్రత్యేకం గా చూసేది. కానీ ఎప్పుడైతే నాగచైతన్య తో పెళ్లి జరిగిందో ఇక సమంత, త్రివిక్రమ్ ను కూడా దూరం పెట్టి అతని ని బాగా అవమానపరిచింది..
కానీ నాగచైతన్య తో విడాకులు తీసుకున్న సమంత తిరిగి హీరోయిన్ గా బిజీ అవ్వాలని చూస్తోంది.ఈ నేపథ్యంలోనే ఒక స్టార్ డైరెక్టర్ తో గానీ స్టార్ హీరో తో గానీ సినిమా చేస్తే ఆమెకు మునుపటి వైభోగం వస్తుంది.. అన్న మాట వాస్తవమే.. అందుకోసమే తాజాగా త్రివిక్రమ్ ని కలిసిన సమంతకు నిరాశ ఎదురైంది అని చెప్పాలి. ఎందుకంటే సమంత చేసిన అవమానాన్ని మరిచిపోలేని త్రివిక్రమ్ ఆమెను ప్రస్తుతం పెద్దగా పట్టించుకోలేదట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.