మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ మెహర్ రమేష్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం `భోళ శంకర్`. మలయాళంలో సూపర్ హిట్ అయిన వేదాళంకు రీమేక్గా రాబోతున్న ఈ మూవీలో చిరుకు సోదరిగా కీర్తి సురేష్ నటించబోతోంది. అలాగే హీరోయిన్గా మిల్కీ బ్యూటీ తమన్నాను తీసుకున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది.
అయితే ఇప్పుడు తమన్నా ఈ సినిమాకు పుచ్చుకుంటున్న రెమ్యూనరేషన్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం.. భోళ శంకర్కి గానూ తమన్నా రూ.3 కోట్లను పారితోషకంగా తీసుకుంటుందని తెలుస్తోంది.
ఇప్పటికే సగం అడ్వాన్స్ కూడా మేకర్స్ ఆమెకు అందించారని ఇన్ సైడ్ టాక్. ఇక మరో విషయం ఏంటంటే.. తమన్నా కెరీర్లో ఇదే హైయ్యస్ట్ రెమ్యూనరేషన్ అని సమాచారం. కాగా, ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీలో చిరు గుండు లుక్లో కనిపించబోతున్నారు.