`నేను శైలజ` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు తొలిసారి పరిచయమైన అందాల భామ కీర్తి సురేష్.. `మహానటి` సినిమాలో సావిత్రిగా తన నటనా విశ్వరూపం చూపించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం ఈ భామ.. మహేష్ బాబు సరసన `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తోంది.
అలాగే మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలుగా `భోళ శంకర్`, నానికి జోడీగా `దసరా` మరియు గుడ్ లక్ సఖీ చిత్రాల్లో కీర్తి నటిస్తోంది. అలాగే తమిళ్, మలయాళ భాషల్లోనూ పలు ప్రాజెక్ట్స్ను టేకప్ చేసిన కీర్తి.. మరోవైపు సోషల్ మీడియా యాక్టివ్గా ఉంటూ అదిరిపోయే ఫొటో షూట్లతో తన ఫాలోవర్స్ను అలరిస్తుంటుంది.
ఇక తాజాగా స్లీవ్ లెస్ జాకెట్, బంగారు వన్నె చీర ధరించి సరికొత్త లుక్లో దర్శనమిచ్చింది కీర్తి. ప్రస్తుతం ఈ భామ నాజూకైన సోయగాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి లేటెందుకు కీర్తి తాజా పిక్స్పై మీరూ ఓ లుక్కేసేయండి.