రిపబ్లిక్ సినిమాపై నారా లోకేష్ షాకింగ్ కామెంట్.. వైరల్..!

మెగా మేనల్లుడు..సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం రిపబ్లిక్. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ నటించింది. ఇక ఈ సినిమాని డైరెక్టర్ దేవాకట్ట అద్భుతమైన సామాజిక అంశాలతో తెరకెక్కించాడు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలందుకుంటోంది ఇప్పుడు. ఇక ఈ సినిమా రంగ పక్కన పెడితే.. ఇక ఈ చిత్రాన్ని ప్రశంసలు అందుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ కూడా ఈ సినిమాపై కొన్ని కామెంట్ చేశాడు అవేంటో చూద్దాం.

రిపబ్లిక్ సినిమా కోసం గ్రేట్ రివ్యూ వింటున్నానని, దేవ కట్ట సాయి ధరంతేజ్ అద్భుతమైన వర్క్ ని నేను కూడా వీలు చూసుకుని చూస్తాను. అంతే కాకుండా సాయి ధరంతేజ్ త్వరగా తిరిగి కోలుకోవాలని కోరుకుంటున్నాను అని నారా లోకేష్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ఏది ఏమైనా ఇలా రాజకీయాల ప్రశంసలు పొందుతోంది ఈ రిపబ్లిక్ సినిమా.