గత రెండు సంవత్సరాల నుంచి సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా విషాదాలే చోటుచేసుకుంటున్నాయి.. ఈ నేపథ్యంలోనే మరొక సీరియల్ నటి హఠాన్మరణం పొందింది.. దీంతో ఒక్కసారిగా సినీ , టీవీ ఇండస్ట్రీ మొత్తం విషాదంలో కూరుకుపోయింది.. ఆమె ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
జీ టీవీ లో ప్రసారం అయిన ‘జోధా అక్బర్’ సీరియల్ ఎంత మంచి గుర్తింపు తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ సీరియల్లో సలీమా బేగం పాత్రలో నటించిన టీవీ నటి మనీషా యాదవ్ కన్నుమూశారు. మనీషా యాదవ్ మెదడు నుంచి రక్తస్రావం జరగడంతో ఆమె తుదిశ్వాస విడిచారు. అయితే మనీషా యాదవ్ శుక్రవారం అనగా అక్టోబర్ 1వ తేదీన మరణించగా ఈ విషయాన్ని ఎక్కడా కూడా చెప్పలేదు.. కానీ తాజాగా మనీషా చనిపోయిన విషయాన్ని ఆమె సహ నటి అయిన పరిధి శర్మ సోషల్ మీడియా వేదికగాా తెలిపారు.
జోధా అక్బర్ సీరియల్ లో నటించే నటీనటులంతా మొఘల్స్ అనే పేరుతో వాట్సాప్ గ్రూప్ ను క్రియేట్ చేసుకున్నామని, ముఖ్యమైన విషయం ఉంటే అందులో షేర్ చేసుకుంటామని పరిధి శర్మ తెలిపారు. ఈ విధంగా మనీషా మరణంపై గ్రూప్లో వచ్చిన వార్తను చూసి తాను షాక్ గురయ్యానని పరధి శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే మనీషాకి ఒక ఏడాది వయసు ఉన్న కొడుకు కూడా ఉన్నాడు.ఇక మనీషా మృతిపై పలువురు సినీ, టివి ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆమె కుటుంబానికి సానుభూతి ప్రకటించారు.