కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కంట్రోల్ అయింది.
గత కొద్ది రోజులుగా రెండు వేలకు లోపుగా రోజూవారీ కేసులు నమోదు అవుతున్నాయి. అయితే మొన్నటితో పోలిస్తే నిన్న రోజూవారీ కేసులు స్వల్పంగా పెరిగాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,439 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 261 కేసులు నమోదు కాగా..అతి స్వల్పంగా విజయనాగరం జిల్లాలో 8 కేసులు నమోదు అయ్యాయి.
దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 20,26,042 కి చేరింది. అలాగే గత 24 గంటల్లో 14 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో మృతుల సంఖ్య 13,964 దగ్గర నిలిచింది. అలాగే నిన్నొక్క రోజే 1,311 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 19,97,454 కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలో 14,624 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, నిన్న రాష్ట్రవ్యాప్తంగా 62,856 కరోనా టెస్ట్లు నిర్వహించారు.