పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న తాజా మల్టీస్టారర్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైనెమెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నిత్యామీనన్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
కరోనా సెకెండ్ వేవ్ తర్వాత ఇటీవలె ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లింది. ఇదిలా ఉంటే.. తాజాగా రానా పవన్పై మరియు ఆయనతో నటించడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రానా మాట్లాడుతూ.. `పవన్ కల్యాణ్ గారి కాంబినేషన్లో సినిమా చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఆయనతో కలిసి నటిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది.
అలాగే ఆయనకు సినిమా పై ఉన్న నమ్మకం, అవగాహన చూస్తే ఆశ్చరుయమేసింది. పాత్ర స్వభావాన్ని త్వరగా పట్టుకోవడం పవన్కు ఉన్న గొప్ప లక్షణం. ఇక ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ ఓ మంచి పుస్తకం వంటివారు. అటువంటి వ్యక్తితో వర్క్ చేయడం వల్ల ఎన్నో నేర్చుకోవచ్చు` అని చెప్పుకొచ్చాడు.