ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో బయోపిక్ల పర్వం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్టీఆర్, వైఎస్ఆర్, సిల్క్ స్మిత, మహానటి సావిత్రి, శకుంతలాదేవి, ఉయ్యాల వాడ నరసింహారెడ్డి, జార్జిరెడ్డి ఇలా పలువురి బయోపిక్లు వెండితెరపై తళుక్కుమన్నాయి.
అయితే ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్ తెరపైకి వచ్చింది. వైఎస్ఆర్ బయోపిక్ను ఆవిష్కరించిన దర్శకుడు మహి రాఘవనే వైఎస్ జగన్ బయోపిక్ కూడా తెరకెక్కించనున్నాడని ప్రచారం జరుగుతోంది.
ఈ బయోపిక్లో స్కామ్ 1992 వెబ్ సిరీస్తో సూపర్ పాపులర్ అయిన ప్రతీక్ గాంధీ హీరోగా కనిపించబోతున్నాడట. జగన్ సొంత పార్టీ స్థాపించడం, పాదయాత్ర, సీఎం అయిన తీరు, రాజకీయ జీవితంలో చోటుచేసుకున్న ఎత్తుపల్లాలు, సీబీఐ కేసులు, జైలుజీవితం.. వంటి అంశాలన్నీ ఈ సినిమాలో చూపించనున్నారట. అంతేకాదు, ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది.