కొరటాల తీసుకున్న నిర్ణయంతో షాక్ లో నెటిజన్లు… ?

కొరటాల శివ డైరెక్షన్ లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్లే. వినోదంతో పాటు సోషల్ ఎలిమెంట్లను జోడించి చెప్పడంలో ఆయన సిద్ధహస్తుడు. ప్రస్తుతం ఈ దర్శకుడు మెగా స్టార్ చిరంజీవితో కలిసి ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఓ ప్రత్యేక పాత్రలో మెరుస్తారని తెలుస్తోంది. టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ఇందులో రామ్ చరణ్ కు జోడీగా కనిపిస్తుందట. స్వరాల మాంత్రికుడు మణిశర్మ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు.

ఇంత వరకు బాగానే ఉన్నా… ఈ దర్శకుడు తీసుకున్న నిర్ణయంతో నెటిజన్లు కంగు తిన్నారట. ఇకమీదట తాను సోషల్ మీడియాను వాడకూడదని ఈ దర్శకుడు ఫిక్స్ అయ్యాడట. ఈ నిర్ణయంతో నెటిజన్లే కాకుండా.. మూవీ ఇండస్ర్టీలో ఉన్న చాలా మంది అవాక్కయ్యారట. కొరటాల శివ సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండరు కదా… తాను ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమై ఉంటుందని పలువురు ఆరా తీస్తున్నారు