ప్రముఖ కామెడీ షో జబర్ధస్త్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో సూపర్ పాపులర్ అయింది యాంకర్ రష్మి గౌతమ్. పలు సినిమా నటించినా రాని గుర్తింపు ఈ షో ద్వారా వచ్చింది. ఇక మరోవైపు ఈ అమ్మడు అందాలకు సోషల్ మీడియాలో యమా ఫాలోంగ్ ఉంది.
ఈ నేపథ్యంలోనే రష్మి ఎప్పుడెప్పుడు ఫోటోలు పెడుతుందా? అని వెయ్యి కళ్లతో ఎదురు చూసేవాళ్లున్నారు. అయితే తాజాగా ట్రెండీ వేర్ లో క్రేజీ ఫోజులు ఇస్తూ ఫొటో షూట్ చేసి.. అందుకు సంబంధించిన ఫొటోలను ఫాలోవర్స్తో పంచుకుంది.
ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఈ ఫొటోల్లో రష్మి అందాలు చూసి.. నెటిజన్లు, అభిమానులు ఫిదా అవుతున్నారు. అంతేకాదు, ఆమె ఫొటోలపై లైకుల వర్షం కురిపిస్తున్నారు. మరి ఆ ఫొటోలపై మీరు ఓ లుక్కేసేయండి.