క్రికెటర్లు గాయాలపాలవ్వడం ఈ మధ్య సాధారణమైపోయింది. అయితే ఒక క్రికెటర్ కి గాయం అయితే ఆ తర్వాత అనేక ఇబ్బందులను ఎదుర్కొవాల్సి ఉంటుంది. తాజాగా పాకిస్థాన్, దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ గాయాల పాలయ్యాడు. పాకిస్థాన్ సూపర్లీగ్లో శనివారం పీఎస్ఎల్లో క్వెట్టా గ్లాడియేటర్స్ తరపున డుప్లెసిస్ మ్యాచ్ ఆడుతున్నాడు. ఆ టైంలో పెషావర్ జల్మీతో జరిగిన మ్యాచ్లో గాయాలపాలయ్యాడు. బౌండరీని ఆపేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు అతడికి గాయమైంది. ఏడవ ఓవర్ లో బౌండరీ దిశగా బాలు కదులుతున్నప్పుడు ఫాఫ్ డుప్లెసిస్ డైవ్ చేశాడు.
ఆ బంతిని అడ్డుకోబోయాడు. ఆ టైంలో నేరుగా వస్తున్న పాకిస్థాన్ క్రికెటర్ మొహమ్మద్ హస్నైన్ ఢీకొన్నాడు. ఆ సమయంలో డుప్లెసిస్ తలకు బలంగా గాయమైంది. దీంతో నొప్పితో డుప్లెసిస్ తట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత అతడిని సహచర ఆటగాళ్లు ఆస్పత్రిలో చేర్చించారు. ప్రస్తుతం క్వెట్టా గ్లాడియేటర్స్ డగౌట్లో డుప్లెసిస్ విశ్రాంతి తీసుకుంటున్నాడు.