బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్కి ఇప్పటికే చాలా ఇళ్లు, భవనాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం.. బిగ్ బి ఇప్పుడు మరో ఖరీదైన డ్యూప్లెక్స్ అపార్ట్మెంట్ను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఈ డూప్లెక్స్ హౌస్ లను ప్రముఖ బిల్డర్ సంస్థ క్రిస్టల్ గ్రూప్ నిర్మించింది.
బహుళ అంతస్తుల ఈ భవనంలో అమితాబ్ కొన్న డూప్లెక్స్ 27, 28 ఫ్లోర్లలో ఉంది. ఈ డ్యూప్లెక్స్ అపార్ట్మెంట్తో 6 కార్లను పార్కింగ్ చేసే అవకాశం లభిస్తుంది. ఇక ఈ ఇంటి వైశాల్యం 5184 చదరపు అడుగులు అని, ఖరీదు రూ. 31 కోట్లు అని తెలుస్తుంది.
ఇక మరో ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే.. బిగ్ బి అపార్ట్మెంట్ కొనుగోలు చేసిన భవనంలోనే బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్కు కూడా అపార్ట్మెంట్ ఉంది. అలాగే ఈ భవనంలో దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ కూడా ఫ్లాట్ కొనుగోలు చేశారు.