ఇటీవల ఛత్రశాల్ స్టేడియంలో జరిగిన వివాదంలో సాగర్ రానా అనే మల్లయోధుడు మృతి చెందిన సంగతి అందరికి విదితమే . ఈ మర్డర్ కేసులో భాగంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్కు ఢిల్లీ పోలీసులు తాజాగా లుక్ఔట్ నోటీసులు జారీచేశారు. ఛత్రసాల్ స్టేడియంలో సాగర్ రానా అనే మల్లయోధుడి పై జరిగిన హత్యకి సుశీల్కు సంబంధాలున్నట్లు పోలీసులు గ్రహించడంతో సుశీల్ కుమార్కు లుక్ ఔట్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.
కేసు లో భాగంగా దాడుల్లో రెజ్లర్ సుశీల్ కూడా ఉన్నట్లు అక్కడ ఉన్న బాధితుల్లో ఒకరు తెలిపినట్లు సమాచారం. బాధితుల ఇచ్చిన స్టేట్మెంట్ బట్టి, ఈ హత్య కేసులో సుశీల్ హస్తం కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించి సుశీల్ కోసం తీవ్రంగా గాలింపు చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా సుశీల్ కోసం వెతుకుతున్న పోలీసులకు అతను ఎక్కడ ఉన్నది తెలీకపోవటంతో, తాజాగా తన పై లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. పోలీసులు ఇంకా స్టేడియంలో ఉన్న సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం .