ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో భాగంగా నిన్న రాత్రి చేపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడిన సంగతి తెలిసిందే.ఈ మ్యాచ్లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.
అనంతరం సన్రైజర్స్ కూడా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది.
దీంతో సూపర్ ఓవర్కు దారి తీసింది. సూపర్ ఓవర్ లో మొదట హైదరాబాద్ తరుపున కెప్టెన్ డేవిడ్ వార్నర్ మరియు విలియమ్సన్ లు బ్యాటింగ్ చేశారు. అసలే సరిగ్గా బ్యాటింగ్ చేయలేని వార్నర్..మొదటి బాల్ నే వృదా చేశాడు. అలాగే చివరి బంతికి రెండు పరుగులు వచ్చినా వార్నర్ బ్యాట్ ను సరిగ్గా పెట్టక పోవడం వల్ల ఒక్క పరుగే లభించింది.
ఆ పరుగు వచ్చి ఉంటే ఫలితం హైదరాబాద్ వైపు వచ్చేది. దీంతో వార్నర్పై విమర్శలు కురిపిస్తున్నారు. ఇక వార్నర్ చేసిన పనికి టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బ కూడా మండిపడింది. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ..వార్నర్ అన్న ఏంటి ఇది, నువ్వు ఎందుకు వచ్చావు.. బెయిన్ స్టో లేదా సుచిత్ ను పంపి ఉండవచ్చు. నీకు టీమ్ ను నిర్మించుకోవాలనుకుంటే డ్రీమ్ 11 లో నిర్మించుకో అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేసింది ఈషా. ఇక ఈమె ట్వీట్కు అందరూ మద్దతు పలుకుతున్నారు.