కరోనా అతి వేగంగా విజృంభిస్తుంది. ఇలాంటి సమయంలో అసలు ఎవరికి ఇది ఎక్కువ రిస్క్ అని సీఎస్ ఐఆర్ ప్యాన్ ఇండియా సర్వే నిర్వహించగా ఈ సర్వేలో భాగంగా 140 మంది డాక్టర్లు, సైంటిస్టులు సీఎస్ఐఆర్ ల్యాబ్ల్లో పనిచేసే 10,427 మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల్లోని ప్రతిరక్షకాల తీరును పరిశీలించారు. పీచు పదార్థం సమృద్ధిగా ఉండే శాకాహారం తినేవారిలో కరోనాను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉన్నట్లు వారు గుర్తించారు.
బీ, ఏబీ గ్రూప్ రక్తం ఉన్నవారిలో సెరో పాజిటివిటీ అధికంగా ఉంటుందని, వారికి కరోనా రిస్క్ చాలా ఎక్కువని పరిశోధకులు చెప్పారు. ఓ బ్లడ్ గ్రూప్ రక్తం ఉన్నవారికి ఈ వైరస్ వల్ల అంత పెద్ద ముప్పేమి ఉండదని అంటున్నారు. అంతేకాకుండా సిగరెట్ తాగేవారి గొంతులో జిగురు పొర ఏర్పడుతుందని, ఇది వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటుందని వారు అన్నారు.