ఫిదా ఫేమ్ సాయి పల్లవి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం ఈ ఇద్దరే యూట్యూబ్ను దున్నేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సాయి పల్లవి నటించిన చిత్రం తాజా `లవ్స్టోరీ`. నాగచైతన్య హీరోగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.
అయితే ఈ చిత్రం నుంచి ఇటీవల `సారంగ దరియా` సాంగ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. బ్రవరి 28న యూ ట్యూబ్ లో రిలీజ్ చేసిన ఈ పాట ఇప్పటికి 150 మిలియన్ వ్యూస్ ను, 1.2 మిలియన్ లైకులను కొల్లగొట్టింది. దీంతో తక్కువ సమయంలో అత్యధిక వ్యూస్ సాధించిన సాంగ్గా సారంగ దరియా రికార్డు క్రియేట్ చేసింది.
ఇక మరోవైపు అల్లు అర్జున్ నటించిన డీజే – దువ్వాడ జగన్నాథం చిత్రం కూడా యూట్యూబ్ లో దూసుకుపోతోంది. తాజాగా ఈ చిత్రం 100 మిలియన్ వ్యూస్ మార్క్ ను క్రాస్ చేసింది. మొత్తానికి అటు సాయి పల్లవి, ఇటు అల్లు అర్జున్ యూట్యూబ్లో ట్రెండింగ్లో కొనసాగుతున్నారు.