టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఏపీ డిప్యూటీ సీఎంగా బిజీగా గడుపుతూనే.. మరో పక్కన తను సైన్ చేసిన సినిమాల కోసం కష్టపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. ఎట్టకేలకు పవన్ హరిహరమలు షూట్ పూర్తి చేశాడు. అంతేకాదు.. వచ్చే నెల 12న సినిమా రిలీజ్ అయినట్లు మేకర్స్.. అఫీషియల్గా కూడా ప్రకటించారు. మొదట క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను.. మధ్యలో వదిలేయడంతో.. ప్రొడ్యూసర్ ఎం. ఎం. రత్నం తనయుడు జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. పాన్ ఇండియన్ పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ వైపు ఆయన మరింత జోరు పెంచాడు. ఇందులో భాగంగానే తాజాగా వీరమల్లు ట్రైలర్ నార్త్ ఇండియాలో గ్రాండ్గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు.
ప్రస్తుతం ఈ నిర్ణయం పవన్ ఫ్యాన్స్లో మరింత ఆసక్తి రేపింది. ఇక ఈ ఈవెంట్ కోసం.. ఇంకా వేదిక ఫిక్స్ అవ్వలేదు. కానీ.. బీహార్, లాక్నో లాంటి హిందీ సెంటర్లలో ఎక్కడ కచ్చితంగా బడా ఫంక్షన్ ఖాయమని టాక్ నడుస్తుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్లో పాటలపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు టీం. ఇప్పటివరకు సినిమా నుంచి 3 సాంగ్స్ రిలీజ్ కాగా.. ఈనెల 28న నాలుగో సింగిల్ ను గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నారు. ఇది ఓ ఐటెం సాంగ్ అని టాక్. పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ సాంగ్ కోసం లిరిక్స్ చేంజ్ చేయించాడని సమాచారం. ఈ పాట తర్వాత మరో రెండు సాంగ్స్ లు కూడా త్వరలోనే వదలనున్నారట. మ్యూజిక్ తో సినిమాపై హైప్ పెంచే ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.
ఇప్పటికే ఆల్బమ్ లో వచ్చిన సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న నేపథ్యంలో.. మిగతా సాంగ్స్ తో సినిమాపై బజ్ పెంచాలన్నదే వారి ఆలోచన. ఇక మూవీ ప్రచారంలో కీలకంగా నిధి అగర్వాల్, మిగతా యూనిట్ సభ్యులు ఇంటర్వ్యూలో పాల్గొననున్నట్లు సమాచారం. ఈ సినిమాకు ముందు వేరే ఇంటర్వ్యూస్ ఒక్కొక్కటిగా రిలీజ్ చేయడంతో సోషల్ మీడియా స్పేస్ ను దక్కించుకోవచ్చని.. జ్యోతి కృష్ణ మాస్టర్ ప్లాన్ వేశాడు. భారీ సినిమాల మధ్యలో.. ఓ బలమైన ఇమేజ్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో వీరమల్లు నార్త్ మార్కెట్ను టార్గెట్ చేస్తున్నారు. బాబిడియోల్ క్రేజ్ రీత్యా అక్కడ ప్రమోషన్స్తో.. ప్రేక్షకుల్లో హైప్ పెంచనున్నారట. ఈ సినిమా హిందీ ఆడియన్స్లో ఏ రేంజ్ హైప్ తెచ్చుకుంటుందో.. ఏ లెవెల్లో అక్కడి జనాన్ని ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.