టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని ఏ రేంజ్ లో దూసుకుపోతున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఈ సినిమా రూ.1700 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి ఇప్పటివరకు టాలీవుడ్లోనే టాప్ సినిమాగా నిలిచిన బాహుబలి, ఆర్ఆర్ రికార్డ్లను పటాపంచలు చేసింది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాపై ఆడియన్స్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. తన నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్ తో చేయనున్నాడు. త్రివిక్రమ్ ఎప్పటికి ఈ సినిమా స్క్రిప్ పనులను పూర్తిచేసుకుని ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా గడుపుతున్నాడు.
ఈ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్లో త్రివిక్రమ్ అడుగు పెట్టనున్నాడు. ప్రయోగాత్మక పీరియడ్ డ్రామా జోనర్ ఫాంటసీ మూవీగా త్రివిక్రమ్ సినిమాను రూపొందించినునన్నాట. ముఖ్యంగా స్వతంత్ర ఉద్యమ నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని.. స్వతంత్రానికి ముందు జరిగిన కొన్ని అంశాలను హ్యూమన్ టచ్ తో హైలెట్ చేస్తూనే.. మైథాలాజికల్ టచ్తో సినిమాలో రూపొందించనున్నారని టాక్ నడుస్తోంది. ఇక ఈ సినిమా షూట్ ప్రారంభించి పూర్తి అవడానికి దాదాపు 15 నెలల వరకు టైం పడుతుందని టీం భావిస్తున్నారటన పాన్ ఇండియన్ సినిమా కాబట్టి మరింత సమయం పట్టే అవకాశం కూడా ఉంది.
దీనికి తగ్గట్టుగానే పోస్ట్ ప్రొడక్షన్ పనులు విషయంలో కూడా ఎక్కువ సమయం తీసుకోవాలి. వీటన్నింటి బట్టి చూస్తే ఈ సినిమా 2027 స్టార్టింగ్ వరకు రిలీజ్ కావడం కష్టమే. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ మళ్లీ వెండి తెరపై 2027 కనిసించడం కష్టమే అంటూ టాక్ నడుస్తుంది. కాగా ఈ సినిమాకు బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపిక పదుకొనే, పూజా హెగ్డే నటించనున్నారని వార్తలు వైరల్ గా మారుతున్నాయి. ఇప్పటికే బన్నీ, పూజా హెగ్డే కాంబోలో ఓ సినిమా తెరకెక్కి బ్లాక్బస్టర్గా నిలిచింది. వీరి కాంబినేషన్లో మరో సినిమా వస్తే చాలా అద్భుతంగా ఉంటుందంటూ బన్నీ ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే టైటిల్ ఫిక్స్ కానీ ఈ సినిమా షూట్ త్వరలోనే ప్రారంభించనున్నారట.