ఐకాన్ సార్ అల్లు అర్జున్ పుష్ప 2 ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రీమియర్స్ రోజున జరిగిన వివాదం ఇప్పటికి టాలీవుడ్ లో దుమారం రేపుతూనే ఉంది. హైదరాబాద్ సంధ్య థియేటర్ ప్రీమియర్స్ క్రమంలో.. తొక్కిసులాట జరిగి మహిళ మృతి చెందడం.. ఆమె కొడుకు చావుబ్రతుకుల మధ్య ఉండడంతో అల్లు అర్జున్ పై కేస్ ఫైల్ అయింది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ను అరెస్ట్ చేసి ఒక రోజు జైల్లో ఉంచారు. ఇలాంటి క్రమంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వివాదం పై మాట్లాడుతూ.. మరింత అజ్యం పోసాడు. అసెంబ్లీలో అల్లు అర్జున్తో పాటు.. ఆయన్ను పరామర్శించిన సినీ ప్రముఖుల అందరి పై కూడా మండిపడ్డాడు.
అంతటితో ఆగకుండా.. ఇకపై ఎలాంటి సినిమాలైనా బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్లు పెంపుకు అనుమతులు ఇచ్చేది లేదంటూ వెల్లడించాడు. అయితే వివాదం రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ మధ్యన కొనసాగితే మంట మాత్రం నిర్మాత దిల్ రాజు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన నుంచి త్వరలోనే మూడు భారీ సినిమాలు రిలీజ్ కానున్నాయి. వాటిలో ఒక పానీ ఇండియన్ సినిమా ఉండడం.. ఇలాంటి టైం లో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన దిల్ రాజు సినిమాలకు పెద్ద ఎదురుదెబ్బగా నిలిచింది. ఇక దిల్ రాజు కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్లో రూపొందించిన మూవీ నెక్స్ట్ జనవరి 10న సంక్రాంతి బరిలో రిలీజ్ కానుంది. చరణ్, శంకర్ కాంబోలో రూపొందిన ఈ సినిమా కోసం ఏకంగా రూ.250 కోట్ల ఖర్చు చేసినట్లు సమాచారం.
అంటే థియేట్రికల్గా కనీసం రూ.500 కోట్లకు పైగా బిజినెస్ జరగాలి. అంత భారీ మొత్తం రాబట్టాలంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా కష్టతరం అవుతుంది. ఈ ఒక్క సినిమానే కాదు.. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు కూడా ఆయన ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. ఇక బాలయ్య డాకు మహారాజ్కు నైజంలో డిస్ట్రిబ్యూట్ చేసింది కూడా దిల్ రాజు కావడంతో.. ఈ మూడు సినిమాలు తెలంగాణలో భారీ లాభాలు పుంజుకోవడం చాలా కష్టమవుతుంది. దీంతో.. అల్లు అర్జున్ చేసిన పనికి రేవంత్ రెడ్డి నిర్ణయం.. దిల్ రాజు ఆశలను ఆవిరి చేసినట్లయింది. రేవంత్ రెడ్డి అన్నట్లుగానే బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపులకు పర్మిషన్ ఇవ్వకపోతే దిల్ రాజు భారీ నష్టం ఎదుర్కోక తప్పదు అంటూ అభిప్రాయాలు వైరల్ గా మారుతున్నాయి.