ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న వారు కూడా సందీప్ రెడ్డి వంగాతో సినిమా చేయాలని ఆశపడుతున్నారు. 2023లో డైరెక్టర్గా సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యానిమల్ ఎలాంటి సంచలన సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాపై విమర్శలు వచ్చిన బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ తో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అంతకుముందు కబీర్ సింగ్, అర్జున్ రెడ్డి సినిమాలతో విజయాన్ని అందుకున్న సందీప్.. యానిమల్ సినిమా సక్సెస్ తో డబుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు. ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేయడానికి సందీప్ రెడ్డి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.
ఇందులో నటించనున్న కాస్టింగ్ గురించి ఇప్పటికే ఎన్నో వార్తలు వైరల్ గా మారాయి. సందీప్ రెడ్డివంగా పాన్ ఇండియన్ డైరెక్టర్ గా తెలుగులోనే కాదు.. బాలీవుడ్ లోనూ మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ప్రభాస్ కూడా పాన్ ఇండియన్ స్టార్ కావడంతో.. ప్రభాస్ – సందీప్ కాంబోలో వస్తున్న సినిమా పై బాలీవుడ్ నటుల్లోను మంచి అంచనాలు ఉంటాయి. ఈ క్రమంలోనే అక్కడి సెలబ్రిటీస్ని కూడా తీసుకోవాలని భావిస్తున్నాడట సందీప్. అలా కొందరి పేర్లు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వారిలో సైఫ్ అలీ ఖాన్, కరీనాకపూర్ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ స్టార్ కపుల్.. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే జంట స్పిరిట్ సినిమాలో నటించే అవకాశం అందుకున్నారని.. వీరిద్దరు ప్రభాస్ సినిమాలో పవర్ఫుల్ విలన్లుగా కనిపించబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిపై మూవీ యూనిట్ నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. కానీ.. ఎక్కడ చూసినా ఈ క్రేజీ న్యూస్ తెగ ట్రెండ్ అవుతుంది. సైఫ్ ఇప్పటికే ప్రభాస్ నటించిన ఆది పురుష్, రీసెంట్గా ఎన్టీఆర్ దేవరతో విలన్ గా నటించి మెప్పించాడు. ఇప్పుడు మరోసారి ప్రభాస్ సినిమాలో విలన్ పాత్రలో కనిపించనున్నట్లు టాక్. అలాగే అతని భార్య బాలీవుడ్ హీరోయిన్ కరీనాకపూర్ కూడా ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనుందట. మరి ఈ వార్తలో నిజంఎంతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.