బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గత ఏడాది పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన జవాన్, పఠాన్ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గరైన షారుక్.. ఒకే ఏడాదిలో రెండు సినిమాలతో 1000 కోట్లు కలెక్షన్లు కొల్లగొట్టి రికార్డులు సృష్టించాడు. అయితే తాజాగా మరోసారి షారుక్ ఖ్ఖాన్ ఓ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. ఇండియాలోనే అలాంటి అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న మొట్టమొదటి స్టార్ హీరో షారుఖ్ అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ అరుదైన గౌరవం ఏంటో.. ఒకసారి చూద్దాం.
స్విజర్లాండ్ లో కన్ ఫిలిం ఫెస్టివల్ ను నిర్వహించే అక్కడ జ్యూరీ సభ్యులు.. షారుఖ్ ఖాన్ కు ఈ ఏడాది జరిగే ఫిలిం ఫెస్టివల్ లో జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించాలని ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా సంజయ్ లీలా భన్సాలి డైరెక్షన్లో వచ్చిన దేవదాస్ సినిమాను కూడా ఈ ఫిలిం ఫెస్టివల్ స్క్రీనింగ్ సెలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఈ అవార్డుకు సంబంధించిన వివరాలు ఫిలిం ఫెస్టివల్ నిర్వాహకులు సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ.. షారుక్ ఖాన్ పై ప్రశంసల వర్షం కురిపించారు.
ఈ క్రమంలోనే షారుక్ ఖాన్ గురించి మాట్లాడుతూ.. ఆయన లాంటి దిగ్గజ నటుడిని మా ఫెస్టివల్స్ కు ఆహ్వానించాలని కోరిక.. 77వ ఎడిషన్ ఫెస్టివల్ తో తీరనుంది. నిర్మాతగా, నటుడిగా ఇండియన్ సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న షారుక్ను సత్కరించడం మాకు గౌరవంగా అనిపిస్తుంది అంటూ వివరించారు. కాగా ఈ ఫిలిం ఫెస్టివల్స్ స్విట్జర్ల్యాండ్లో ఆగస్టు 7 నుంచి 17వ తేదీ వరకు గ్రాండ్ లెవెల్లో జరగనుంది. షారుక్ ఈ అవార్డును ఆగస్టు 10న అందుకుంటున్నారు. అయితే షారుక్ ఖాన్ కు ఇలాంటి అరుదైన అవార్డ్ దాకడం నిజంగానే ఓ రికార్డు అని చెప్పాలి. ఇప్పటివరకు ఈ రికార్డును ఏ స్టార్ హీరో కూడా అందుకోలేకపోయాడు.