టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏఎన్ఆర్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమా మూల స్తంభాలుగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లను ఎప్పుడు టాలీవుడ్ ప్రేక్షకులు చెప్తూనే ఉంటారు. ఇక అక్కినేని ఫ్యామిలీ నుంచి ఏఎన్ఆర్ నటవారసుడుగా నాగార్జున ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈయన తర్వాత నటవారసులుగా నాగచైతన్య, అఖిల్ను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు నాగ్. ఇక వీరితో పాటు అక్కినేని ఫ్యామిలీ నుంచి నటవారసులుగా సుమంత్, అలాగే నాగార్జున మేనకోడలు సుప్రియ కూడా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం సుమంత్ ఆచితూచి సినిమాల్లో నటిస్తున్నాడు. ఇక సుప్రియ.. పవర్ స్టార్తో కలిసి అక్కడఅమ్మాయి.. ఇక్కడ అబ్బాయి.. సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. తర్వాత మెల్లగా ప్రొడ్యూసర్గా మరి ఇప్పుడు ఇండస్ట్రీలో కొనసాగుతుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే వీరిలో చైతు, సుమంత్, సుప్రియ ముగ్గురు పెళ్లిళ్లు కూడా విచిన్నమైన సంగతి తెలిసింది. చైతు.. సమంతను ఏడు సంవత్సరాల ప్రేమాయణం తర్వాత వివాహం చేసుకొని నాలుగేళ్లలోనే విడాకులు ఇచ్చేశాడు. ఇక సుమంత్ తను ఎంతగానో ప్రేమించి వివాహం చేసుకున్న కీర్తి రెడ్డితో విడిపోయాడు. అలాగే సుప్రియ కూడా తన భర్తకు విడాకులు ఇచ్చేసింది. ఇలా ఈ మూడు జంటలు వేరువేరు ట్విస్టులతో విడిపోయారు.
ఇక నాగ్ రెండో కొడుకు అఖిల్ కూడా శ్రియ భూపాల్ను ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత ఆ పెళ్లి బ్రేకప్ అయిన సంగతి తెలిసిందే. దీంతో అక్కినేని కుటుంబానికి పెళ్లిళ్లు అచ్చిరావు అంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా నాగార్జున ఓ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. తన కొడుకులు చైతన్య, అఖిల్కు ఎలాగైనా పెళ్లి చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడట నాగ్. చైతు ఓ హీరోయిన్ను ప్రేమించాడట.. ఇక నాగ్ చైతన్యకు తనకు నచ్చిన అమ్మాయితో పెళ్లి చేస్తానని ఇప్పటికే వివరించిన సంగతి తెలిసిందే.
అలాగే అఖిల్కు ఓ వ్యాపారవేత్త కుటుంబానికి చెందిన అమ్మాయిని చూశాడట. వారి వ్యక్తిగత జీవితాలు దారిలో పెట్టాలని ఉద్దేశంతోనే నాగార్జున ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది. ఇక సుప్రీతా కూడా తనకంటే చిన్నవాడైన ఓ వ్యక్తితో ప్రేమాయణంలో ఉందని.. అతన్నిత్వరలోనే వివాహం చేసుకోబోతుంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇలా ఒకేసారి అక్కినేని ఫ్యామిలీలో మూడు పెళ్లిళ్లు అంటూ వార్తలు వినిపించడంతో అభిమానులు వీరి కుటుంబం నుంచి పెళ్లిళ్లకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందా అంటూ ఎదురుచూస్తున్నారు.