కుర్రకారు గుండెల్లో కేక పుట్టిస్తున్న శివాత్మిక!

ప్రముఖ హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక “దొరసాని” చిత్రంతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయింది. 2019 విడుదలైన ఈ చిత్రం అనుకున్న విజయాన్ని సాధించకపోయినప్పటికీ, ఈ చిత్రంలో దొర కూతురిగా శివాత్మిక నటన, ప్రేక్షకులను ఆకట్టుకుంది. తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుంది. ఆ తరువాత తమిళంలో “ఆనందం విలయాడుం వీడు”, “నిత్తమ్ ఒరు వానం” అనే చిత్రాల్లో నటించింది. తెలుగులో “పంచతంత్రం”, తాజాగా కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన “రంగ మార్తాండ” చిత్రంలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. శివాత్మిక కేవలం నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. రాజశేఖర్ హీరోగా నటించిన “కల్కి” చిత్రానికి నిర్మాతగా వ్యవరించింది శివాత్మిక.

నటిగా, నిర్మాతగా తన ప్రతిభను కనబరిచిన ఈ ముద్దుగుమ్మ, ప్రస్తుతం సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తుంది. శివాత్మిక తాజాగా ఒక ఫోటోషూట్ లో పాల్గొంది. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తెలుపు రంగు బ్లౌజ్, లెహంగా తో ఆమె తీసుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంస్టాగ్రామ్ లో ఎక్కువగా ఆక్టివ్ గా ఉండే శివాత్మిక, ఎప్పటికప్పుడు తన ఫోటోలను అభిమానులతో పాంచుంటూ ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలలో ఆమె ఎద, నడుము అందాలు, కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తున్నాయి. ఆమె ఫోటోలను షేర్ లు, లైకులతో మారుమ్రోగిస్తున్నారు. శివాత్మిక ప్రస్తుతం మణికంఠ గెల్లి దర్శకత్వంలో “విద్య వాసుల అహం” చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రం 2024 ఫిబ్రవరి లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం తరువాత ఒక తమిళ చిత్రంలో ఆమె నటించబోతోంది సమాచారం.

ఖైదీ, మాస్టర్ చిత్రాల ద్వారా ప్రేక్షకులకు పరిచయమిన అర్జున్ దాస్ హీరోగా, ప్రముఖ దర్శకుడు విశాల్ వెంకట్ తెరకెక్కించబోతున్న చిత్రంలో ఆమె హీరోయిన్ గా నటించబోతోంది తెలుస్తోంది. శివాత్మిక నటించిన “నిత్తమ్ ఒరు వానం” చిత్రంలో ఆమె నటనకు ఫిదా ఐపోయాడట, దత్సకుడు విశాల్ వెంకట్. ఆ సినిమా చూసిన వెంటనే ఆ చిత్రం దర్శకుడు కార్తీక్ నుండి శివాత్మిక నెంబర్ తీసుకొని వెంటనే ఆమెను తన తదుపరి చిత్రం కోసం సంప్రదించాడట. ఈ విషయాన్నీ స్వయంగా దర్శకుడు విశాల్ వెంకట్ మీడియా సమక్షంలో తెలియజేసారు.