ICC WORLD CUP: ఫైనల్ మ్యాచ్ కు హాజరుకానున్న టాలీవుడ్ స్టార్స్ ఎవరంటే..?

ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ మరికాసేపట్లో జరగనుంది. ఈ మ్యాచ్లో ఇండియా ఆస్ట్రేలియా ఎప్పుడెప్పుడు తలపడతాయా అంటూ క్రికెట్ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ ఈరోజు మధ్యాహ్నం 2:30 నిమిషాలకు ప్రారంభం కాబోతుంది. అయితే ఈ క్రికెట్ మ్యాచ్ లైవ్ లో చూసేందుకు చాలా మంది సినీ ప్రముఖులు కూడా ఆసక్తి చూపుతున్నారు.

ఇప్పటికే లైవ్ మ్యాచ్ లో క్రికెట్ స్టేడియంలో చూసేందుకు రామ్ చరణ్, నాగార్జున, విక్టరీ వెంకటేష్ హాజరు కాబోతున్నారట. పీఎం నరేంద్ర మోడీ కూడా క్రికెట్ ను వీక్షించేందుకు సిద్ధమయ్యాడు. ఇక వీరితో పాటే బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన రన్ బీర్ కపూర్, షారుక్ ఖాన్, అమితాబచ్చన్ లైవ్ మ్యాచ్ ను వీక్షించేందుకు హాజరు కాబోతున్నారు.

కోలీవుడ్ నుంచి కమల్ హాసన్, ధనుష్, రజనీకాంత్.. మలయాళం నుంచి మోహన్ లాల్ లైవ్ మ్యాచ్ చూసేందుకు స్టేడియంకు వస్తున్నారట. ఇక దాదాపు 12 సంవత్సరాల తర్వాత టీం ఇండియా మళ్లీ ఫైనల్ మ్యాచ్ చేరుకుంది.ఈసారి ప్రపంచకప్ కచ్చితంగా ఇండియానే సాధించాలంటూ.. టీమిండియా కప్ గెలవాలంటూ క్రికెట్ ప్రియులతో పాటు.. భారతీయులంతా ఆకాంక్షిస్తున్నారు. ఇక స్టేడియంలో ఈ స్టార్స్ అంతా పాల్గొనడంతో స్టేడియంకు సినీ గ్లామర్ కూడా కళ్ళ తెచ్చి పెట్టింది.