నటుడు శ్రీకాంత్ వల్ల బాధపడిన కమెడియన్ పృధ్విరాజ్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో 30 ఇయర్స్ అంటు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు నటుడు పృథ్వీరాజ్.. ఏన్నో సినిమాలలో తనదైన కామెడీతో ప్రేక్షకులను నవ్వించిన వృద్ధి నటుడుగా తానుపడిన కొన్ని సందర్భాలను సైతం తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది. డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన దేవుళ్ళ సినిమాలో ముందుగా రాముడి పాత్ర కోసం తనను తీసుకోగా సీత పాత్ర కోసం లయ ను లక్ష్మణుడి పాత్ర కోసం మరొకని తీసుకున్నారట..

మేకప్ వేసుకున్న తర్వాత ఎన్టీఆర్ లా ఉన్నారంటూ కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు మరుసటి రోజున రెడీ అవుతుండగా అక్కడికి నటుడు శ్రీకాంత్ రావడంతో రాముడు పాత్రను ఆయన పోషించారని తెలియజేశారు. దీంతో చాలా బాధపడ్డానని అదే సినిమాలో పృథ్విరాజ్ వెంకటేశ్వర స్వామి పాత్రలో కనిపించి అలరించారని తెలిపారు. నటుడుగా ఎన్నో చిత్రాలలో నటించిన పృథ్వీరాజ్.. పొలిటికల్ పరంగా కూడా గతంలో బాగా పాపులారిటీ అందుకున్నారు ఈ మధ్యకాలంలో మళ్లీ వైసీపీ నుంచి జనసేన పార్టీలోకి చేరినట్లు తెలుస్తోంది.

పృధ్విరాజ్ తన డైరెక్షన్లో తన కూతురిని హీరోయిన్గా పరిచయం చేస్తూ కొత్త రంగుల ప్రపంచం అనే చిత్రాన్ని పెరకెక్కించారు ఈ సినిమా నవంబర్ 17న ఈ ఏడాది విడుదల కాబోతోంది. తనదైన స్టైల్ లో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే పృథ్వీరాజ్.. ఎన్నో రకాల ట్రో ల్స్ కు అవమానాలకు గురైన సందర్భాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో పృథ్విరాజ్ కు అవకాశాలు కూడా చాలా తగ్గిపోయాయని తెలుస్తోంది ముఖ్యంగా తన భార్య నుంచి విడాకులు తీసుకోవడంతో ఆమెకు కూడా నెలకి కొన్ని లక్షల రూపాయలు ఇవ్వాల్సిందిగా కోర్టు ఆదేశం జారీ చేసింది.