పూజ హెగ్డే అని నమ్మించి మోసం చేసిన స్టార్ హీరో.. ఎవరంటే..?

సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే యూత్ లో ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోయిన్లలో పూజా హెగ్డే కూడా ఒకరు. మొదటిసారి నాగచైతన్య హీరోగా నటించిన ఒక లైలా కోసం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత హృతిక్ రోషన్తో కలిసి జోధా అక్బర్ వంటి చిత్రాలలో నటించింది. కానీ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. అందానికి అందం అభినయం ఉన్నప్పటికీ మొదటిలో సక్సెస్ కాలేక పోయింది.

ఆ తర్వాత మూడేళ్లు గ్యాప్ ఇచ్చి అల్లు అర్జున్ తో దువ్వాడ జగన్నాథమ్ సినిమాతో మళ్ళీ కంబ్యాక్ ఇచ్చిన పూజా హెగ్డే ఒకసారిగా ఈమె కెరియర్ మారిపోయింది. స్టార్ హీరోల సరసన నటించి టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. అయితే చాలామందికి సైతం క్రేజ్ రాగానే టాలీవుడ్ ఇండస్ట్రీని విమర్శిస్తూ ఉన్నారు. అలా ఇప్పుడు పూజ హెగ్డే పరిస్థితి కూడా అలాగే మారిపోయింది. పవన్ తో మహేష్ బాబుతో ఇటీవలే రెండు సినిమాలు ఓకే చేసినట్టు చేసి రిజెక్ట్ చేసిందట.

అయితే బాలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందిన సల్మాన్ ఖాన్ తో కీసికా బాయ్ కిసికి జాన్ అనే చిత్రంలో హీరోయిన్గా నటించే అవకాశం అందుకుంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్ తో మంచి సన్నిహిత్యం పెంచుకుంది. ఆ సమయంలోనే సల్మాన్ ఖాన్ నువ్వు బాలీవుడ్ మెటీరియల్ వి ఎంతకాలం అక్కడే సౌత్ ఇండస్ట్రీలో ఉంటావ్ నా మాట విని ఇక్కడికి షిఫ్ట్ అయిపో తాను చూసుకుంటానని చెప్పినట్లు సమాచారం. గతంలో కూడా ఎంతో మంది హీరోయిన్లను స్టార్ హీరోలుగా చేసిన సల్మాన్ ఖాన్ ఆ మాట చెప్పడంతో పూజా హెగ్డే కూడా టాలీవుడ్ హీరోల సినిమాలలో వదిలేసుకుందట. కానీ ఇప్పటివరకు ఈమెకు సరైన క్రేజీ ఆఫర్లు కాదు కదా.. పేరు కూడా రాలేదు. దీంతో సల్మాన్ ఖాన్ ని నమ్మి పూజా హెగ్డే మోసపోయింది.