తాజాగా అక్కినేని కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు మూడవ కుమార్తె, నాగార్జున సోదరి నాగ సరోజ అలియాస్ నాగ సుశీల అనారోగ్యంతో మరణించారు. నాగేశ్వరరావుకి ముగ్గురు కూతుర్లు, ఇద్దరు కొడుకులు కాగా ఇందులో ఇప్పటికే పెద్ద కుమార్తె సత్యవతి గత కొంతకాలం కిందట కాలం చేశారు. ఇప్పుడు నాగ సరోజ మరణంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
అక్కినేని నాగేశ్వరరావు పెద్ద హీరో అయినప్పటికీ కూడా నాగసరోజ సినిమా ఇండస్ట్రీకి దూరంగానే ఉంటూ వచ్చారు. సినిమా రిలీజ్ ఫంక్షన్లలో కానీ సినిమాలకు సంబంధించిన ఏ ఈవెంట్ లో కూడా ఆమె కనిపించలేదు. ఇప్పటివరకు ఆమె పేరు కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక నాగ సరోజ ఎవరో కాదు సుశాంత్ తల్లి కూడా.. ఈమె నాగ సుశీలాగా అందరికీ ఒకరకంగా పరిచయమనే చెప్పాలి. కానీ పూర్తిస్థాయిలో ఈమె గురించి ఎవరికీ అవగాహన లేదు.
ఒక గృహిణి గానే తన కెరియర్ను కొనసాగించిన నాగసరోజ చివరి వరకు కూడా అలాగే ఉండిపోయింది. నాగేశ్వరరావు మిగిలిన నలుగురు పిల్లలందరికి గుర్తింపు వచ్చింది కానీ నాగ సరోజ మాత్రం ఎటువంటి గుర్తింపు పొందలేదు. అందుకే ఈమె మరణం కూడా ఎవరికి పెద్దగా తెలియదనే చెప్పాలి. నాగ సరోజ మంగళవారమే మరణించినా.. ఆమె గురించి ఎవరికీ తెలియక పోవడం వల్ల ఈ విషయం కాస్త లేటుగా వెలుగులోకి వచ్చింది. ఇకపోతే అక్కినేని ఇంట పూర్తిస్థాయిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక నాగ సరోజ మరణానికి పలువురు సినీ సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.