అప్పుడు ఎలిమినేషన్.. ఇప్పుడు రీఎంట్రీ.. ట్విస్ట్ అదిరిపోయింది..

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 ఇటీవల మొదలైంది. ఉల్టాప‌ల్టా కాన్సెప్ట్ తో మొదలైన ఈ సీజన్ రియాల్టీలో అంత సీన్ లేదు అనిపించింది. ఎపిసోడ్స్ అన్ని కూడా ఏవ్రేజ్‌గా సాగాయి. దాదాపు 6 సీజన్లో ఎప్పుడు లేని విధంగా వరుసగా 5 వారాల్లో అమ్మాయిలు ఎలిమినేట్ అయ్యారు. గతవారం హౌస్ కి కెప్టెన్‌గా రైతుబిడ్డ ప్రశాంత్ వివరించాడు. ఆ బాధ్యతలు ఇచ్చారు కానీ ప్రశాంత్ పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు.

క్యాప్టెన్సీ సరిగా వినియోగించుకోలేకపోయవని స్వయంగా బిగ్‌బాస్‌తో చివాట్లు తిన్నాడు. తాజాగా ఫ్రిన్స్ హౌస్‌కి రెండో కెప్టెన్ అయ్యాడు. కెప్టెన్సీ చేతికి వచ్చేసరికి ఆటిట్యూడ్ పెరిగిపోయింది. అమర్దీప్ తో గొడవలు పెట్టుకున్నాడు. దానిపై నాగార్జున క్లాస్ పీకాడు. తాజా ప్రోమోలో ఈ టాపిక్ హైలైట్ అయింది. ఇప్పటివరకు ఐదు వారాల్లో కిరణ్ రాథోడ్, షకీలా, ర‌తిక‌, దామిని, శుభశ్రీ ఎలిమినేట్ అయ్యారు.

వీళ‌లో కొందరు ఎలిమినేట్ అవడం చాలా మందిని షాక్‌కి గురి చేసింది. ఇక ర‌తిక‌, దామిని, శుభశ్రీ మళ్లీ హౌస్ లోకి రియంట్రి ఇచ్చారు. ప్రోమోలో వీళ్ళు రావడం చూపించారు. అయితే రీయంట్రీ ఇచ్చారా లేదా ఎంటర్టైన్మెంట్ కోసం కాసేపు హౌస్‌లోకి తీసుకువెళ్తున్నారా అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. దీంతో బిగ్‌బాస్ ప్రేక్షకులకు భలే ట్విస్ట్ ఇచ్చినట్టు అయింది.