వైజయంతి నిర్మాతలు వార్నింగ్ ఇచ్చింది ఆ స్టార్ హీరోకేనా..!!

వైజయంతి మూవీస్ బ్యానర్ పైన గతంలో ఎన్నో సినిమాలు విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి..ఇటీవల కాలంలో సీతారామం అనే సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చి మళ్లీ తమ నిర్మాణ సంస్థలు పలు సినిమాలను చేస్తున్నట్లుగా తెలియజేశారు. ఇటీవలే ప్రభాస్ కల్కి సినిమాకి సంబంధించి ఒక ఫోటో గ్రాఫిక్ డిజైనర్ కంపెనీ నుంచి లీక్ కావడంతో వారి పైన లీగల్గా యాక్షన్ తీసుకోబోతున్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఉండేందుకు సైతం.. ఆడియన్స్ కి ఇండస్ట్రీలో ఉండే వర్గాల వారికి ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది.

అయితే ఇప్పుడు తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది..అదేమిటంటే జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా విషయంలో వారిని ఇస్తున్నట్లుగా సమాచారం.. డైరెక్టర్ కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి, శ్రీదేవి కలయికలో వచ్చిన ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీలో ఒక కల్ట్ క్లాసికల్ సినిమాగా నిలిచిపోయింది. ఈ చిత్రాన్ని కూడా వైజయంతి బ్యానర్స్ పైనే నిర్మించారు.. ఈ సినిమా విషయంలో ఇప్పుడు ఇన్ డైరెక్ట్ గా చిరంజీవికి వార్నింగ్ ఇస్తున్నట్లుగా సమాచారం.

అసలు విషయం ఏమిటంటే డైరెక్టర్ వశిష్టతో చిరంజీవి తన 157 వ సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా షోషియో ఫాంటసీ డ్రామా తో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వశిష్ట మాట్లాడుతూ ఈ సినిమా జగదేకవీరుడు అతిలోకసుందరి తరహాలో ఉంటుందని తెలియజేశారు.. దీంతో ఇండస్ట్రీ వర్గాలలో ఈ విషయం వైరల్ గా మారింది. అయితే ఈ విషయం విన్న వైజయంతి మూవీస్ మేకర్ ఒక ప్రెస్ నోట్ ని రిలీజ్ చేయడం జరిగింది.. ఒక నోట్ లో రాసుకోస్తూ.. జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా కంప్లీట్ కాపీరైట్స్ మాకు మాత్రమే ఉన్నాయి..ఈ సినిమా కంటెంట్ ను ఉపయోగించుకొని లేదా ఏదైనా వెబ్ సిరీస్ తీయాలన్నా మా అంగీకారం కచ్చితంగా ఉండాల్సిందే అలా లేనిచో కంటెంట్ ని ఉపయోగించుకుంటే వారి పైన లీగల్గా యాక్షన్ తీసుకుంటామంటూ వార్నింగ్ ఇవ్వడం జరిగింది.