ఐశ్వర్యరాయ్ అత్తారింట్లో గొడవలు ఉన్నాయా.. అందుకే ఇలా..?

మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదిలా ఉండగా తాజాగా బాలీవుడ్ బిగ్ బి తన 81వ పుట్టినరోజు వేడుకలను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈయన పుట్టినరోజున చాలామంది సెలబ్రిటీలు, అభిమానులు స్పెషల్ గా విష్ చేశారు. అయితే అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు విషయంలో ఒకరోజు ఆలస్యంగా కోడలు ఐశ్వర్యారాయ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో అమితాబ్ బచ్చన్ తన కూతురు ఆరాధ్యతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ మీరు ఎప్పటికీ భగవంతుడి ఆశీర్వాదంతో నిండు నూరేళ్లు ఇలాగే చల్లగా ఉండాలి అంటూ కోరుకుంది.

అయితే ఈమె చేసిన పోస్ట్ బాగానే ఉంది కానీ అందులో ఒక అనుమానాన్ని వ్యక్తం చేసేలా ఆ పోస్టు ఉందని నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. అదేమిటంటే ఐశ్వర్యరాయ్ షేర్ చేసిన ఆ ఫోటో ఎడిట్ చేసి పెట్టిందట. అసలు ఫోటోలో అమితాబ్ బచ్చన్ మనవరాలు ఆరాధ్యతో పాటు తన భార్య జయా బచ్చన్ అలాగే తన ఆడపడుచు పిల్లలతో కలిసి ఉన్న ఫోటో ఉంది. కానీ ఆ ఫోటో నుండి అందరిని ఎడిట్ చేసి కేవలం అమితాబ్ బచ్చన్ అలాగే ఆరాధ్య ఫోటోలను మాత్రమే క్రాఫ్ట్ చేసి ఆమె పోస్ట్ చేసింది.. దీంతో కొంతమంది నేటిజెన్లు ఐశ్వర్యరాయ్ ని అత్తింటి వారు ఇబ్బంది పెడుతున్నారా? అన్నట్టుగా కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

 

అయితే మరి కొంతమంది ఇందులో తప్పేముంది.. అయినా అనుమాన పడాల్సిన విషయం ఏమీ లేదు కదా అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. వాస్తవానికి సినిమా ఇండస్ట్రీ వాళ్లపై ఇలాంటి ప్రచారాలు జరగడం కొత్తేమీ కాదు. కానీ ఇటీవల ప్యారిస్ లో జరిగిన ఫ్యాషన్ వీక్ లో ఐశ్వర్యరాయ్ జయాబచ్చన్, ఐశ్వర్యరాయ్ ఆడపడుచు శ్వేతా బచ్చన్ అలాగే ఆమె కూతురు నవ్య నవేలీ పాల్గొనగా ఐశ్వర్యరాయ్ తో పాటు నవ్య కూడా ర్యాంప్ వాక్ చేశారు . ఇలా ర్యాంప్ వాక్ చేసేటప్పుడు నవ్య నున్ ఎంకరేజ్ చేసిన జయాబచ్చన్, శ్వేతాలు ఐశ్వర్య వస్తే మాత్రం పట్టించుకోలేదు. అందుకే ఆమె ఆ కోపంతో ఇలా ఫోటోలు ఎడిట్ చేసి పెట్టిందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.